google.com, pub-9226383964852987, DIRECT, f08c47fec0942fa0 Vijayaswapnam.net : జులై 2024

31, జులై 2024, బుధవారం

ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా పర్యటన ఏర్పాట్లు - ఎలుగుబంట్లు సంచారం అటవీ అధికారులు స్పందించండి:పెద్దగుట్టపల్లి గ్రామస్తులు - క్రీడల్లో రాణించిన కస్తూరిబా విద్యార్థినీలు - బడిలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం

ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా పర్యటన ఏర్పాట్లు


శ్రీసత్యసాయిజిల్లా పుట్టపర్తి(ఓడిచెరువు) జూలై28(విజయస్వప్నం.నెట్)

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనను జయప్రదం చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని బీసీ సంక్షేమ, చేనేత జౌళిశాఖ మంత్రి సబితా అధికారులకు ఆదేశించారు.ఆదివారం పుట్టపర్తి కలెక్టరేట్ కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పర్యటనపై జిల్లా కలెక్టర్ చేతన్,జిల్లాస్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.మంత్రి సబితా ఈసందర్భంగా మాట్లాడుతూ సామాజిక భద్రత ఫింఛన్లు నగదు 4వేలకు పెంచి ఇచ్చిన హామీని నిలబెట్టుకుని, ప్రతి కుటుంబంలో పెద్ద కొడుకుగా అండగా నిలిచారన్నారు.మడకశిర మండలంలోని గుండుమల గ్రామంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని,ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.అనంతరం ఎస్పీ రత్న మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట భద్రత చర్యలు చేపడతామని తెలిపారు. హెలిప్యాడ్,ముఖ్యమంత్రి పాల్గొనే వేదిక వద్ద భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.ఈకార్యక్రమంలో పెనుకొండ సబ్ కలెక్టర్ అపూర్వ భరత్,ఎమ్మెల్యేలు పల్లె సింధూరరెడ్డి,కందికుంట వెంకటప్రసాద్, ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి,ఆర్డీవో భాగ్యరేఖ,డిఎస్ఓ వంశీకృష్ణారెడ్డి తదితర అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.     గుండుమలలో మంత్రి పరిశీలన  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటన సందర్భంగా మడకశిర మండలంలోని గుండుమల గ్రామంలో మంత్రి సబిత పర్యటించి, ఏర్పాట్లు పరిశీలించారు.ఫింఛన్లు పంపిణీ చేసే లబ్దిదారులతో మాట్లాడారు.అనంతరం పాలిటెక్నిక్ కళాశాల  మైదానంలో సియం పర్యటన కోసం ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు.

$$$__________@@@__________$$$

వైభవంగా మొహరం వేడుకలు 

 




 శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు/ ఆమడగూరు,జూలై28(విజయస్వప్నం.నెట్)

అమడగూరు మండల పరిధిలో గుండువారిపల్లి,చిన్నగానిపల్లి గ్రామాల్లో పీర్ల చారవిడిలో  కొలువుతీరిన  పీర్ల స్వాములకు గత వారం రోజులుగా గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ.... రెండు రోజులుగా రాత్రివేళల్లో గ్రామస్తులు పెద్ద ఎత్తున చావిడి వద్దకు చేరుకుని డప్పు వాయిద్యాలు నడుమ నృత్యాలతో అల్లావుతొక్కుతూ నృత్యాలు చేశారు.భక్తులందరికీ ప్రసాదాలను అందజేశారు. చావిడి వద్ద గుండువారిపల్లి యూత్ ఆధ్వర్యంలో ఆర్కెస్ట్రా ఏర్పాటు చేసి,పీర్ల పండగను పురస్కరించుకొని గ్రామస్తులంతా వారి బంధువులను ఆహ్వానించారు. బంధు మిత్రులతో గుండువారిపల్లి, చిన్నగానపల్లి గ్రామాలు కళకళలాడాయి.ఆదివారం చివరి రోజు పీర్ల స్వాములకు ఘనంగా జలధి కార్యక్రమాన్ని నిర్వహించారని గుండువారిపల్లి, చిన్నగానపల్లి గ్రామస్తులు,యువకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో చిన్నగానపల్లి గ్రామ పెద్దలు జి.నరేందర్ రెడ్డి,జి వెంకటరెడ్డి,శేఖర్ రెడ్డి,రామచంద్రరెడ్డి,గుండువారిపల్లి గ్రామ పెద్దలు వీరారెడ్డి,నంజిరెడ్డి,గోపాల్ రెడ్డికృష్ణారెడ్డి యువత మనోహర్ రెడ్డి,రాజా,గ్రామస్తులు వివిధ గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చి పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఎటువంటి అవంచనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.

ఓడిచెరువులో పీర్లు పండుగ

ఓడిచెరువు మండలంలోని ఎం.కొత్తపల్లి, తంగేడుకుంట, ఓడిచెరువు గ్రామాల్లో ఘనంగా మొహర్రం వేడుకలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.ఓడిచెరువు పీర్ల చావిడి వద్ద గ్రామస్తులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొని అగ్నిగుండం వద్ద డప్పు వాయిద్యాలతో నృత్యాలు చేస్తూ ఘనంగా జలథి ఉత్సవ వేడుకలు నిర్వహించారు.అంతక ముందు పీర్లను పురవీధుల్లో ఊరేగిస్తూ బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు,అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

$$$__________@@@__________$$$

మహిళల ఆరోగ్యానికి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ప్రత్యేక దృష్టి 

శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు)పుట్టపర్తి జూలై28(విజయస్వప్నం.నెట్)

గ్రామీణ ప్రాంత గర్భిణీ స్త్రీలు ప్రసవ సమయంలో ఎదుర్కొనే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ప్రత్యేక చొరవతో వాటికి అవసరమయ్యే  మందులను ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు అయ్యేలా సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్ చర్యలు తీసుకున్నారు.

ఈ మధ్య జరిగిన అనంతపురం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో అలాగే సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జులై 11న జరిగిన జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో ప్రసవ సమయంలో గ్రామీణ ప్రాంత పేద మహిళలు పడే ఇబ్బందులను గుర్తుచేస్తూ వారి ప్రాణాలు కాపాడే టెర్బ్యూటాలియన్ మెడిసిన్ ను,ఆల్ట్రాసౌండ్ ట్రాన్సడుసర్ మెషిన్ ను జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేస్తే గర్భిణీ స్త్రీల ప్రాణాలు కాపాడ వచ్చునని పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి,జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.దీనికి వెంటనే జిల్లా కలెక్టర్ చేతన్ ప్రత్యేక చర్యలు తీసుకొని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి కోరిన మందులను,ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉంచినట్లు జిల్లా కలెక్టర్ చేతన్ ఆదివారం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి తెలిపారు.ఈసందర్భంగా కలెక్టర్ చేతన్ కు,రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి ఎమ్మెల్యే పల్లె సిందూర రెడ్డి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

$$$__________@@@__________$$$

ఎలుగుబంట్లు సంచారం

అటవీ అధికారులు స్పందించండి:పెద్దగుట్టపల్లి గ్రామస్తులు

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూలై28(విజయస్వప్నం.నెట్)

మండలంలోని పెద్దగుట్టపల్లి సమీప ప్రాంతాల్లో గత కొద్దిరోజులుగా నల్లగుట్ట పరిసరాల్లో ఎలుగుబంట్లు సంచారిస్తుండడంతో రైతులు, గ్రామస్తులు భయాందోళనలు చెందుతున్నారు.అమడగూరుమండలం మహమ్మదాబాద్ గ్రామ సమీపంలో కొండ గుట్టల్లో ఇటివల ఎలుగుబంట్లు సంచారం తెలిసిందే, మహమ్మదాబాద్ గ్రామంలో కొండ నుండి మండలంలోని పెద్దగుట్టపల్లి సమీప నల్లగుట్టలోకి ఎలుగుబంట్లు వస్తుంటాయని ఆయా గ్రామస్తులు చెబుతున్నారు.పొలాల్లో సంచారిస్తుండడంతో భయాందోళనలు చెందుతున్నారు.ఇప్పటికైన అటవీ అధికారులు స్పందించి గ్రామాల్లో ఎలుగుబంట్లు రాకుండా చర్యలు తీసుకోవాలని గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

$$$__________@@@__________$$$

క్రీడల్లో రాణించిన కస్తూరిబా విద్యార్థినీలు

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూలై29(విజయస్వప్నం.నెట్)

నల్లమాడ మండలంలో ఇటీవల నిర్వహించిన అండర్ 14 విభాగంలో షాట్ ఫుట్, రన్నింగ్ క్రీడల్లో ఓడిచెరువు మండలంలోని కస్తూరిబా బాలికల పాఠశాల విద్యార్థులు ప్రతిభే కనబరిచారు. షాట్ ఫుట్ అండర్ 16 విభాగంలో శృతి ప్రధమ స్థానంలో, షాట్ ఫుట్ అండర్ 14 విభాగంలో శారణ్య ద్వితీయ స్థానంలో, రన్నింగ్ అండర్ 14 విభాగంలో స్వప్న ప్రధమ స్థానంలో నిలిచి, జిల్లా స్థాయి క్రీడలకు ఎంపికైనట్లు ఎస్ఓ గీతబాయి, వ్యాయామ ఉపాధ్యాయురాలు దేవి తెలిపారు.ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సోమవారం ఉపాధ్యాయ బృందం అభినందనలు తెలిపారు.

$$$__________@@@__________$$$

స్ఫూర్తిప్రదాతల పేర్లతో ప్రభుత్వ పథకాలు హర్షణీయం

సియం చంద్రబాబు నాయుడుకి అభినందనలు: బిజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు

శ్రీసత్యసాయిజిల్లా,అమడగూరు,జూలై 29(విజయస్వప్నం.నెట్)

భావి తరాలకు స్ఫూర్తిని అందించే సమాజ సేవకులు,శాస్త్రవేత్తలు,విద్యావేత్తల పేర్లతో ప్రభుత్వ పథకాలను అమలు చేయడం హర్షణీయమని,ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖలో పథకాలను డా.సర్వేపల్లి రాధాకృష్ణన్,డొక్కా సీతమ్మ,అబ్దుల్ కలాంపేర్లతో అమలు చేయాలని నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి,విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ బాబుకి బిజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఆర్గానిక్ సెల్ కన్వీనర్ చింతా శరత్ కుమార్ రెడ్డి ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు.గత ప్రభుత్వ పాలనలో అన్ని పథకాలకు ముఖ్యమంత్రి తన పేర్లు పెట్టుకొన్నారని,అలాంటి దుస్సంప్రదాయానికి మంగళంపాడి,విద్యార్థులలో స్ఫూర్తిని కలిగించే మహనీయుల పేర్లతో పథకాలు అమలు మంచి పరిణామనికి  నాంది పలికినందుకు ఈసందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.పాఠశాల విద్యార్థులకు అందించే విద్యా కానుక ద్వారా యూనిఫాం,పుస్తకాలు,స్కూల్ బ్యాగ్,బూట్లు,సాక్స్ లాంటి విద్యాసామాగ్రి ఇస్తున్నారని,ఈ పథకాన్ని డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో అమలు చేయడం సముచితమని,ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చి,ఆంధ్రా విశ్వవిద్యాలయానికి ఉప కులపతిగా,భారత తొలి ఉపరాష్ట్రపతిగా,2వ రాష్ట్రపతిగా సమర్థంగా బాధ్యతలు నిర్వర్తించిన సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం రేపటి పౌరులకు మార్గ నిర్దేశంగా వుంటుందని,ఈ పేరు పెట్టడం ద్వారా లక్షలాదిమంది ఉపాధ్యాయులు గౌరవాన్ని కాపాడడంమే కాకుండ వారందరి మనసును గెలుచుకున్నరని అభిప్రాయం వ్యక్తం చేశారు.మధ్యాహ్న భోజన పథకానికి సైతం గత ముఖ్యమంత్రి తన పేరు పెట్టుకున్నారని,ఇందుకు భిన్నంగా అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ పేరును ఈ పథకానికి పెట్టడాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతించాలని,ఏ వేళలో అయినా కడుపు నిండా అన్నంపెట్టి ఆకలి తీర్చిన దానశీలి డొక్కా సీతమ్మ వంటి సేవమూర్తి పేరుతో వారి దయాగుణం,సేవాభావం విద్యార్థులకు తెలియచేయడం ద్వారా ఆ సద్గుణాలు అలవడుతాయని,సమాజంలో సేవాగుణం విద్యార్థి దశ నుంచి వారిలో అలవర్చుకుంటాన్నారు.మన దేశపు మిస్సైల్ మ్యాన్ డా.అబ్దుల్ కలాం పేరుతో విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించడం ద్వారా యువతలో నూతనోత్తేజాన్ని కలిగిస్తుందని,పేద కుటుంబంలో పుట్టిన అబ్దుల్ కలాం ఎన్నో ఆటుపోట్ల నడుమ విద్యాభ్యాసం సాగించి శాస్త్రవేత్తగా ఎన్నో విజయాలు అందుకొన్నారని,తదనంతరం రాష్ట్రపతిగా ఆదర్శవంతంగా బాధ్యతలు నిర్వర్తించారని,అబ్దుల్ కలాం  జీవన ప్రస్థానం నవతరంలో స్ఫూర్తిని కలిగిస్తుందని,విద్యార్థి దశ అంటే అబ్దుల్ కలాం లాంటి గొప్ప మహనీయుని యొక్క జీవితం విశేషాలు విద్యార్థులు తెలుసుకొనే అవకాశం కలుగుతుందని,ఎంతోమంది భావి భారత పౌరులు ప్రభావితం చేయగలుగుతుందని పేర్కొన్నారు.కోట్లాదిమంది యువకులు జీవితాలను ప్రభావితం చేసింది స్వామి వివేకానంద పేరును ఏదైనా ఒక యువతకు సంబంధించిన పథకానికి పెట్టాలని ఆయన ఈసందర్భంగా కోరారు.మహనీయుల పేర్లతో పథకాలు అమలు చేయడం ద్వారా వారి సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకొంటారని,ఆ మహనీయుల దివ్యాశ్సీసులు రాష్ట్ర ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు  నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి ఎల్లవేళలా ఉంటాయని ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జనసేన అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్,భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి దగ్గుపాటి పురందేశ్వరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

$$$__________@@@__________$$$

బడిలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం



శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూలై29(విజయస్వప్నం.నెట్)

మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సోమవారం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ డే సందర్భంగా శిక్షా సప్తఆహ్(శుభ తిథి భోజనం కార్యక్రమం)లో భాగంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు.మండలంలోని ఎంబి క్రాస్ గ్రామ ప్రాధమిక పాఠశాలలో సర్పంచ్ ధారా లక్ష్మీదేవి ఆధ్వర్యంలో పథకాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారన్నారు. ఉపాధ్యాయ బృందం,ఎంపీటీసీ శ్రీనివాసులు, ధారా,నాగేంద్ర,స్కూల్ కమిటీ ఛైర్మన్ రామాంజనేయులు, రమేష్, రాజేష్,బాలకృష్ణ, జనసేన విజయకుమార్, తదితరులు పాల్గొన్నారు.అల్లాపల్లి పంచాయతీ గౌనిపల్లి గ్రామ పాఠశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఉపాధ్యాయ బృందం ప్రారంభించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.... పాఠశాల మోనులో పొందుపరిచిన భోజనంతో పాటు పౌష్టికాహారం విద్యార్థులకు అందించినట్లు తెలిపారు. ప్రత్యేకంగా తయారుచేసిన పాయసం, భోజనాలు ఏర్పాటు చేసి విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. ఈకార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మహ్మద్ రియాజ్, ఉపాధ్యాయ మోహన్ రెడ్డి,నాగరాజు, రిటైర్డ్ టీచర్ జీవి ఆదినారాయణ, రామలక్ష్మి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

శ్రీస్వామి వారి హుండీ లెక్కింపు మొత్తం రూ.90,73,407/-


శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు)కదిరి జూలై 30(విజయస్వప్నం.నెట్)

కదిరి పట్టణంలో వెలసిన శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో సంబందించిన హుండిల లెక్కింపు మంగళవారం పూర్తి చేయగా  రు.90,73,407/-లు 66 రోజులు మొత్తం నగదుగా వచ్చిందని, బంగారు 23 గ్రామలు 855 మీల్లి గ్రామాలు, వెండి 310 గ్రామాలు,విదేశి కరెన్సీ యూఎస్ఏ(అమెరికా) 43 డాలర్లు, సౌదీ అరేబియా1.00, నేపాల్ : 5.00, కోవెట్ :1.00 హుండీ ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.

ఆలయ కార్యనిర్వహణాధికారి వెండిదండి శ్రీనివాసరెడ్డి అధ్వర్యములో లెక్కింపు చేపట్టగా,హుండీ లెక్కింపు పర్యవేక్షణాధికారిగా డి.రమేష్ బాబు, సీనియర్ సహాయకులు,జిల్లా దేవాదాయశాఖ కార్యాలయం, శ్రీసత్యసాయి జిల్లా వారు హాజరైయ్యారు.హుండి లెక్కింపు కార్యక్రమములో  దేవస్థానము సిబ్బంది,ఎస్.బి.ఐ బ్యాంకు కదిరి మేనేజర్ బి.హరిప్రసాద్,బ్యాంకు సిబ్బందితో పాటు వివిధ సేవా సంస్థ సభ్యులు  పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

రాజముద్రతో పాస్ పుస్తకాలు హర్షణీయం

- బిజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూలై30(విజయస్వప్నం.నెట్)

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలు తీసుకురావడం హర్షణీయమని భారతీయ జనతా పార్టీ సత్యసాయి జిల్లా కార్యవర్గ సభ్యులు డాక్టర్. ఆకుతోట హరికృష్ణ తెలిపారు.ఆయన ఈసందర్భంగా మాట్లాడుతూ.... ప్రజల ఆస్తి పత్రాలపై జగన్ ఫోటో ఎందుకని  వాపోయిన రైతన్నలు,లాండ్ టైటలింగ్ యాక్ట్ భయపడిన రైతన్నలకు ఇకపై జనం ఆస్తులపై జగన్ దిష్టిబొమ్మలు ఉండవని,ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు  మాటిచ్చారని,ముఖ్యమంత్రి అయ్యాక రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేస్తున్నారని,జగన్ ప్రభుత్వం తన బొమ్మలు,రంగుల కోసం ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చుపెట్టిందని,జగన్ బొమ్మల పిచ్చి వల్ల మొత్తంగా రూ. 700 కోట్ల వరకు ప్రజాధనం వృధా అయ్యిందన్నారు.ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు ప్రజల కోరిక మేరకు పట్టాదారు పాసుపుస్తకాలు,భూమి యాజమాన్యపు హక్కు పత్రాలపై రాజముద్రతో పంపిణీ చేయాలని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిర్ణయించిందని, క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే భూమి యొక్క వివరాలు,మ్యాప్ ద్వారా డైరెక్ట్ గా భూమి దగ్గరికి వెళ్లే అవకాశం కూడా ఉంటుందని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బిజేపీ రాష్ట్ర అధ్యక్షులు, రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరికి  ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

$$$__________@@@__________$$$

శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆలయానికి  సప్లైయర్స్  సామాగ్రి వితరణ


శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు)అమడగూరు,జులై 30(విజయస్వప్నం.నెట్)

మండల కేంద్రంలోని  శ్రీచౌడేశ్వరిదేవి అమ్మవారి దేవస్థానానికి సంటికే నగర్, ఎలక్ట్రానిక్ సిటీ,బెంగళూరు నివాసులు నారాయణ స్వామి కళావతి దంపతులతో కలిసి ఆలయ ధర్మకర్త పొట్టా పురుషోత్తంరెడ్డి ఆధ్వర్యంలో శ్యామియానాలు -3,కుర్చీలు -60,టేబుల్స్ -12,సైడ్వాల్స్ -3,కార్పేట్ 120,మీటర్స్ వస్తువులు అందజేశారు.ఈసందర్భంగా ఆలయ ధర్మకర్త మాట్లాడుతూ.... కోరికలు తీర్చే అమ్మవారి మహిమలకు ఆకర్షితులై వారి కుల దైవాన్ని కోలుచుకునేందుకు భక్తులు ఈవిదంగా సహాయపడటం చాలా సంతోషకరమని,దాత కుటుంబానికి అమ్మవారి ఆశిస్సులు ఉండాలని కోరుకుంటూ దేవస్థానం తరుపున కృతజ్ఞతలు తెలిపారు.

$$$__________@@@__________$$$

ఫీర్ల పండుగ వేడుకల్లో అన్నదానం


శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు) అమడగూరు,జూలై30(విజయస్వప్నం.నెట్)

మండల పరిధిలోని గుండువారిపల్లి గ్రామంలో యువత,గ్రామ ప్రజలు మొహరం(ఫీర్లు)పండుగ సందర్బంగా ఫీర్ల చావిడి వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమం గ్రామ పెద్దల సహకారంతో వైభవంగా మొహరం వేడుకలు నిర్వహించారు.జలథి సందర్భంగా యువత ముందుండి ఉత్సవ కార్యక్రమంలో పాల్గొని సేవాభావం ఏర్పర్చు కోవాలని గ్రామం పేరు మండల,క్షేత్రస్థాయిలో గుర్తింపు తీసుకురావాలని గ్రామ పెద్దలు కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో గుండువారిపల్లి గ్రామస్తులు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

నేడు కొండకమర్లలో ఉచిత గుండె వైద్యశిబిరం

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూలై30(విజయస్వప్నం.నెట్)

మండలంలోని కొండకమర్ల పంచాయతీ గ్రామ ఉర్దూ పాఠశాలలో నేడు(బుధవారం)ఉచిత వైద్యశిబిరం నిర్వహించనున్నట్లు గ్రామ పెద్దలు మంగళవారం ఓప్రకటనలో తెలిపారు.లైఫ్ లైన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మార్క్ సూపర్ స్పెషాలిటీ గుండె ఆసుపత్రి వైద్యులతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి గుండె నొప్పి,ఛాతీ నొప్పి, గుండె దడ,ఆయాసం,గుండెలో మంట,ఛాతీలో బరువుగా వుండడం,కాలు వాపులు రావడం,చెమటలు పట్టడం తదితర వ్యాధులకు చికిత్స అందిస్తారని,అలాగే ‍ బ్లడ్ షుగర్,బిపి,ఈసీజీ,2డి ఎకో ద్వారా వైద్య సేవలు అందిస్తారని కార్యనిర్వహాకులు సాథక్ బాషా,అబ్లు, జావేద్,ఆట ఉల్లా సర్,సాదిక్ లు పేర్కొన్నారు.నేడు బుధవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వైద్య శిబిరంలో వైద్య పరీక్షలు నిర్వహిస్తారని,వివిధ వ్యాధుల చికిత్సలకు ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని,కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

28, జులై 2024, ఆదివారం

శ్రీఖాద్రీశుని దర్శించుకున్న కర్నాటక లోకాయుక్త జస్టిస్ బి.వీరప్ప - జిల్లా స్థాయి లాంగ్ జంప్ పోటీలో విద్యార్థినీ గౌతమీ ఎంపిక - రిటర్నుల గడువు పెంచండి:డిటిఎఫ్ - ఉచిత మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన - పీర్ల చావిడి లోప్రత్యేక పూజలు - అంగనవాడి కార్యకర్త ఆత్మహత్యాయత్నం

శ్రీఖాద్రీశుని దర్శించుకున్న కర్నాటక లోకాయుక్త జస్టిస్ బి.వీరప్ప 

శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు)కదిరి జూలై27(విజయస్వప్నం.నెట్)

నవ నరసింహుని క్షేత్రములలో కెల్ల భక్త ప్రహ్ల్లాద సమేతముగా కదిరి పట్టణంలో స్వయంభూగా వెలసిన  శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయాన్ని కర్నాటక రాష్ట్రం లోకాయుక్త జస్టిస్  బి.వీరప్ప శనివారం కుటుంభసమేతముగా విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు.ముందుగా లోకాయుక్త జస్టిస్ బి.విరప్ప కుటుంబ సభ్యులతో దేవస్థానం వద్దకు చేరుకోగానే ఆలయ తూర్పూ రాజగోపురము వద్ద నుండి పూర్ణకుంభముతో ఆలయ కార్యనిర్వహణాధికారి వెండి దండి శ్రీనివాస రెడ్డి,దేవస్థానము ప్రధాన అర్చకలు స్వాగతం పలికి శ్రీస్వామి,ఆమ్మవార్ల ఆలయములో ప్రత్యేక పూజలు నిర్వహించి  శ్రీస్వామి వారి చిత్ర పటము,శేషవస్త్రములతో సత్కరించి,తీర్థ ప్రసాదములు అందజేశారు.

$$$__________@@@_________$$$

ఘనంగా శ్రీపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవం




శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు) జూలై 27(విజయస్వప్నం.నెట్)

మండల కేంద్రానికి సమీపంలో ఎం.కొత్తపల్లి బండపై వెలసిన శ్రీధర్మశాస్త్ర అయ్యప్పస్వామివారి దేవస్థానంలో ఆవరణలో హెడ్ కానిస్టేబుల్ దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి శనివారం కాలజ్ఞాని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఉపాలయంలో పురోహితులు పంచరత్న సురేష్ శర్మ వేద మంత్రాలతో విగ్రహ ఆరాధన పుణ్యకార్యం ఘనంగా నిర్వహించినట్లు ఆలయ నిర్మాణ సంకల్పకులు పచ్చార్ల ఆంజనేయులు నాయుడు తెలిపారు.హెడ్ కానిస్టేబుల్ గౌడ్,సౌభాగ్య దంపతుల ఆధ్వర్యంలో  గత నెలన్నర క్రితం శ్రీధర్మశాస్త్ర అయ్యప్పస్వామివారి దేవస్థానంలో ఆవరణలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి,గోవిందమ్మ పుణ్య దంపతుల ఉపాలయంలో విగ్రహ ప్రతిష్ఠ చేపట్టగా,41 రోజుల మండల కాలం ఆరాధన మాస పూజ్యోత్సవం భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారని తెలిపారు.ముందుగా శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గోవిందమ్మ పుణ్య దంపతుల విగ్రహానికి జల శుద్ధి, పసుపు,కుంకుమ అర్చన పూజలు నిర్వహించి, వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు, కర్పూర హారతుల నీరాజనాలతో ప్రత్యేక పూజలు, ధూపదీప నైవేద్యాలు సమర్పించి, భక్తులకు తీర్థ,అన్నప్రసాదాలు అందించినట్లు తెలిపారు.ఈకార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు,చిన్నారులు చరిత,స్రుజన,లైన్ మేన్ గంగాధర,ఆలయ సేవకులు బ్యాంక్ శీనా, డబురువారిపల్లి రమేష్,ఆనంద్, సర్వేయర్ గంగులప్ప,మల్లెల రమేష్,మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రీధర్మశాస్త్ర అయ్యప్పస్వామివారి దేవస్థానం అభివృద్ధికి దాతలు,భక్తులు,ఆలయ సేవకులు సహయ సహకారాలు అందించడం ఆనందంగా వుంటుందని ఈసందర్భంగా ఆలయ నిర్మాణ సంకల్పకులు పచ్చార్ల ఆంజనేయులు నాయుడు తెలిపారు.

$$$__________@@@_________$$$

జిల్లా స్థాయి లాంగ్ జంప్ పోటీలో విద్యార్థినీ గౌతమీ ఎంపిక

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూలై 27(విజయస్ళప్నం.నెట్)

నల్లమాడ మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన రూరల్ గర్ల్స్ అథ్లెటిక్స్ మీట్లో ఓబుళదేవరచెరువు ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల   విద్యార్థిని ఎం.గౌతమి  అండర్-14కేటగిరి నందు లాంగ్ జంప్ విభాగంలో ద్వితీయ స్థానం సాధించి,ఆగష్టులో అనంతపురం జిల్లా కేంద్రంలో నిర్వహించే ఆర్డీటీ సెంట్రల్ మీట్ కు ఎంపికైన సందర్బంగా విద్యార్థిని గౌతమికి  పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయిలు గోపీనాథ్,ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం అభినందనలు తెలిపారు.

$$$__________@@@_________$$$

అనంతపురం జిల్లా ఎస్పీని మర్యాద పూర్వకంగా కలిసిన పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర


శ్రీసత్యసాయిజిల్లా పుట్టపర్తి జూలై27(విజయస్వప్నం.నెట్)

అనంతపురం జిల్లా ఎస్పీ మురళీ కృష్ణని నగరంలోని పోలీస్ విశ్రాంతి భవనంలో శనివారం పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి,మాజీమంత్రి  పల్లె రఘునాథ్ రెడ్డి,పీవీకేకే కళశాల చైర్మెన్ పల్లె వెంకట కృష్ణ కిషోర్ రెడ్డి,కేరళ మాజీ డిజిపి శంకర్ రెడ్డితో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.

$$$__________@@@_________$$$

రిటర్నుల గడువు పెంచండి:డిటిఎఫ్

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూలై27(విజయస్వప్నం.నెట్)

రిటర్నుల గడువు పెంచాలని ఎక్స్ సామాజిక మాధ్యమం ద్వారా ఇన్కమ్ టాక్స్ ఆఫ్ ఇండియా వారికి సాంకేతిక సమస్యలను దృష్టిలో ఉంచుకొని రిటర్నుల గడువును పెంచాలని జిల్లా అధ్యక్షులు గౌస్ లాజమ్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫారం 26ఏయస్,వార్షిక సమాచార నివేదిక తదితర వివరాలకు సంబంధించిన వ్యత్యాసాలు కనిపిస్తున్నాయని పోర్టల్ లో ఎదురవుతున్న సాంకేతిక కారణాలవల్ల 26ఏయస్  ఏఐఎస్ లను తీసుకోవడం సాధ్యం కావడం లేదని ఓటీపీలు సరిగా రావడంలేదని 26 ఏయస్ లో రిఫ్లెక్ట్ అయినా  ఈ-ఫీలింగ్ పోర్టల్ లో రిఫ్లెక్ట్ కావడం లేదని తదితర సాంకేతిక సమస్యలు దృష్టిలో పెట్టుకొని రిటర్నుల గడువు ఆగస్టు 31 వరకు పెంచాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

$$$__________@@@_________$$$

ఉచిత మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన



శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు) అమడగూరు జూలై27(విజయస్వప్నం.నెట్)

మండల కేంద్రంలో శనివారం శ్రీచౌడేశ్వరి కళ్యాణ మండపంలో అమడగూరు యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది.ఈ సందర్భంగా యూత్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి దొడ్డం అశోక్ మాట్లాడుతూ ఆమడగూరు మండల ఇప్పటి జరగని కనివిని ఎరుగని రీతిలో మొట్టమొదటిసారిగా మెగా రక్తదాన శిబిర కార్యక్రమానికి అశేష ప్రజానీకం పాల్గొన్నారని,విజయవంతం చేసిన యూత్ అసోసియేషన్ సభ్యులకు మండల ప్రజలకు దాతలకు ధన్యవాదాలు తెలిపారు.ఈకార్యక్రమంలో 68 మంది రక్తదానం చేయడం సంతోషదాయకమని యువత ఇలాగే స్వచ్ఛంద కార్యక్రమాలలో పాల్గొని సేవాగుణం అలవర్చుకోవాలని యూత్ అసోసియేషన్ తరపున కోరారు.ఈ కార్యక్రమంలో  అధ్యక్షులు నాగార్జున,గౌరవ సలహాదారు టైలర్ రామాంజి,కోశాధికారి శివ శంకర,కార్యదర్శి సులేమాన్,సభ్యులు బషీర్,సింహ,పిల్ల అంజి,పవన్,షాజహాన్,కాలేశ్,వినయ్,రేవంత్,శివ,రాజా,మధు,బాలాజీ,రాఘవ,చంద్రహాసన్,జూనియర్ కళాశాల సిబ్బంది,సర్పంచ్ షబ్బీర్, నాయకులు శామ్ బాబు నాయుడు,జెడ్పిటిసి శివశంకర్ రెడ్డి,సూర్యనారాయణ రెడ్డి, పాత్రికేయులు,పోలీస్ సిబ్బంది, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

$$$__________@@@_________$$$

పీర్ల చావిడి లోప్రత్యేక పూజలు

నేడు జలది పండుగ ఏర్పాట్లు పూర్తి


శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు)అమడగూరు,జూలై27(విజయస్వప్నం.నెట్)

మండలంలోని గుండువారిపల్లి  గ్రామ నడిబొడ్డున పీర్ల చావిడిలో  కొలువుతీరిన  పీర్ల స్వాములకు గత వారం రోజులుగా గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.అందులో  భాగంగా శుక్రవారం రాత్రి నుండి శనివారం తెల్లవారుజామున వరకు గ్రామస్తులు పెద్ద ఎత్తున చావడి వద్దకు చేరుకుని డప్పు వాయిద్యాలు నడుమ అల్లావు తోక్కారు.అక్కడికి వచ్చిన భక్తులందరికీ ప్రసాదాలు అందజేశారు.చావిడి దగ్గర గుండువారిపల్లి యూత్ ఆధ్వర్యంలో ఆర్కెస్ట్రా ఏర్పాటు చేసి గ్రామస్తులకు వినోదం కల్పించారు.పీర్ల పండగను పురస్కరించుకొని గ్రామంలో బంధువులతో హడావుడి కనిపిస్తుంది.నేడు ఆదివారం చివరి రోజు పీర్ల స్వాములకు ఘనంగా జలధి కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు గుండువారిపల్లి యూత్ సభ్యులు పేర్కొన్నారు.కావున మండల వ్యాప్తంగా ఉన్న భక్తాదులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున జలధి కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

$$$__________@@@_________$$$

అంగనవాడి కార్యకర్త ఆత్మహత్యాయత్నం----

- తెదేపా నాయకుడు ఆంజనేయులు వేధింపులు భరించలేక  ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియో చిత్రీకరణ-- ఆంజనేయులును వెంటనే అరెస్టు చేయాలని సిఐటియు నాయకులు,అంగన్వాడి యూనియన్ నాయకులు తహశిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా----

పోలీస్ స్టేషన్ ముట్టడి

చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ హమీ

శాంతించిన యూనియన్ నాయకులు 

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూలై 27(విజయస్వప్నం.నెట్)




ఓడిచెరువు మండలం కొండకమర్ల పంచాయతీ పరిధిలోని వీరప్పగారిపల్లికి చెందిన అంగన్వాడీ కార్యకర్త నాగమణి తెదేపా నాయకుడు ఆంజనేయులు పెడుతున్న వేధింపులు భరించలేక  శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.బాధితురాలు ఆత్మహత్యాయత్నానికి ముందు సెల్ఫీ వీడియోలో తమను వేధిస్తున్న ఆంజనేయులుపై విమర్శలు చేస్తూ పురుగులు మందు తాగి అపస్మారస్థితిలోకి వెళ్లింది.విషయం తెలుసుకున్న స్థానికులు బంధువులు,నాగమణిని హుటాహుటిన108 ద్వారా కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి  తరలించారు. సీఐటీయూ,అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన ఓడిచెరువు మండలంలోని వీరప్పగారిపల్లి అంగన్వాడీ కార్యకర్త నాగమణి రాజకీయ వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడంపై అంగన్వాడి యూనియన్ నాయకులు,సిఐటియు నాయకులు అంగన్వాడీ కార్యకర్తలు పెద్ద ఎత్తున మండల కేంద్రానికి చేరుకొని తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.వారు మాట్లాడుతూ వేధింపులకు  గురి చేసిన ఆంజనేయులును వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.తహశీల్దార్ ఖాజాబికి వినతి పత్రం అందజేశారు.అనంతరం తహసిల్దార్ కార్యాలయం నుంచి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా నినాదాలు చేస్తూ తరలి వెళ్లారు.స్టేషన్ ఎదుట ధర్నాకు దిగిన సిఐటియు యూనియన్ నాయకులు లక్ష్మీనారాయణ,శ్రీరాములు,కుళ్లాయప్ప,అంగనవాడి యూనియన్ జిల్లా అధ్యక్షులు  మహాబూన్ నిషా,రంగమ్మ ఆశీర్వాదమ్మ మాట్లాడుతూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నాగమణికి అంగన్వాడీ పోస్టు వచ్చిందన్నారు. అంతకుముందు ఆంజనేయులు భార్య అంగన్వాడి కార్యకర్తగా ఉండేదని ఆమె బోగస్ సర్టిఫికెట్లతో ఉద్యోగంలో చేరారని తొలగిస్తారని తెలుసుకొని స్వచ్ఛందంగా ఆమె రాజీనామా చేసిందన్నారు.అనంతరం  వెలుబడిన నోటిఫికేషన్ ద్వారా నాగమణి అంగన్వాడీ కార్యకర్తగా విధులకు చేరిందన్నారు.ఇటీవల తెదేపా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆమెను విధుల నుంచి తప్పుకుంటే తమ సమీప బంధువును అంగన్వాడీ కార్యకర్తగా చేర్పించుకోవచ్చని  ఆంజనేయులు పథకం వేశారని,ప్రస్తుతం పని చేస్తున్న నాగమణిని విధుల నుంచి తప్పుకోవాలని లేనిపక్షంలో నిన్ను నానా ఇబ్బందులు గురి చేస్తామని వేధింపులు చేపట్టడం మొదలుపెట్టాడని,దీంతో పలుమార్లు అంగన్వాడి సిడిపిఓ పిడి తదితరులు గ్రామస్థాయిలో విచారణ చేపట్టారని,ఆమెపై వేసిన ఆరోపణలు నిరాధారణ ఆరోపణలని కొట్టివేయడంతో చేసేది లేక ఆమెను వ్యక్తిగతంగా మానసికంగా బెదిరింపులు చేస్తూ ఒత్తిడికి గురి చేశారన్నారు.ఆంజనేయులు వేధింపులకు తట్టుకోలేనని నాకు మరణమే శరణ్యం అంటూ పురుగుల మందు తాగి ఆత్మహత్యానికి పాల్పడిందని నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.సిఐ రాజేంద్రనాథ్ యాదవ్ విచారించి బాధితురాలికి తగిన న్యాయం చేస్తామని నిందితునిపై కేసు నమోదు చేస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. అంగన్వాడీ కార్యకర్తకు అండగా యూనియన్ నాయకులు ఉంటామని ఆమెకు ఉద్యోగ భద్రత కల్పించే వరకు పోరాడుతామని రాజకీయ వేధింపులకు గురి చేస్తున్న  వారిపై తక్షణం చర్యలు తీసుకొని శిక్షించాలని కోరారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు యూనియన్ నాయకులు పాల్గొన్నారు.

 ఆసుపత్రిలో అంగనవాడి కార్యకర్త నాగమణిని  పరామర్శించిన సిఐటియు నాయకులు.

 ఓడిచెరువు మండలంలోని వీరప్పగారిపల్లి మినీ అంగన్వాడీ కార్యకర్త నాగమణి రాజకీయ పార్టీ శ్రేణుల వేధింపులు తాళలేక శనివారం ఉదయం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న సీఐటీయూ నాయకులు పరామర్శించారు.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జి.ఎల్ నరసింహులు మాట్లాడుతూ ఓడిచెరువు మండలం వీరప్పగారిపల్లికి చెందిన అంగన్వాడి మినీ వర్కర్ నాగమణిని వేధించిన తెలుగుదేశం పార్టీ నాయకులపై  కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలన్నారు. అంగన్వాడి కార్యకర్తలపై రాజకీయ వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వాలు మారినప్పుడల్లా అంగన్వాడీ కార్యకర్తలను రాజకీయంగా వేధించడం,భయభ్రాంతులకు గురిచేయడం సరైనది కాదన్నారు.ఐసిడిఎస్ అధికారులు కూడా అధికార పార్టీ నాయకుల ఒత్తిడికి లొంగిపోయి అంగన్వాడీ కార్యకర్తలను వేధించడం సరైంది కాదన్నారు. ఇలాంటి వేధింపులు మానుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు.పరామర్శించిన వారిలో అంగన్వాడి యూనియన్ నాయకులు లక్ష్మీదేవి,భాగ్యమ్మ,సుజాత, మోక్ష,వెంకటలక్ష్మి,సిఐటియు నాయకులు జగన్మోహన్,బాబ్ జాన్ తదితరులు ఉన్నారు.

$$$__________@@@_________$$$

అంగన్వాడీ భోధకులపై రాజకీయ వేధింపులు తగదు:ఏఐటీయూసీ జిల్లా ప్రధానకార్యదర్శి ఆంజనేయులు

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూలై27(విజయస్వప్నం.నెట్)

జిల్లా వ్యాప్తంగా స్కీమ్ వర్కర్లు,అంగన్వాడీ, ఆశ,మధ్యాహ్నన భోజన, అవుట్ సోర్సింగ్,ఫీల్డ్ అసిస్టెంట్లు,కాంట్రాక్టు, కార్మికులపై ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి విధుల నుంచి తొలగిస్తామని రాజకీయ వేధింపులకు దిగుతూ,కార్మికులను మానసిక వేధింపులకు గురి చేస్తూ ఇబ్బంది పెడుతున్నారని,దీనిని ఏఐటీయూసీ జిల్లా సమితి తరపున  ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.ఈ సందర్బంగా ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ....ఇటీవల కొండకమర్ల పంచాయతీ,వీరప్పగారిపల్లి గ్రామానికి చెందిన అంగన్వాడీ కార్యకర్త నాగమణిపై లేని పోనీ ఆరోపణలు చేస్తూ,జిల్లా అధికారులకు పిర్యాదు చేసి మానసికంగా ఇబ్బంది పెడుతూ అంగన్వాడీ ఉద్యోగం నుంచి తొలగించాలని వేదించడం వల్ల అంగన్వాడీ సెంటర్ లోనే శనివారం ఆమె ఆత్మ హత్యకు పాల్పడటం బాధాకరమని,ఇప్పటికైనా కార్మికులపై రాజకీయ వేధింపులు ఆపాలని డిమాండ్ చేసారు,లేకుంటే శాసనసభ్యులు,మంత్రులను ఎక్కడిక్కడ కార్మికుసంఘాల ఆధ్వర్యంలో అడ్డుకుంటామని ఆయన ఈసందర్భంగా హెచ్చరించారు.

26, జులై 2024, శుక్రవారం

హాస్టల్ విద్యార్థులు పదిలో వందశాతం ఉత్తీర్ణత - విద్యార్థులు క్రమశిక్షణతో చదవాలి:మోడల్ స్కూల్ విద్యార్థినీలకు అవగాహన కల్పించిన సిఐ - ఘనంగా మొహర్రం వేడుకలు - కదిరి పోలీసుస్టేషన్లో తనిఖీ చేపట్టిన జిల్లా ఎస్పీ - మహమ్మదాబాదులో ఎలుగుబంటి సంచారం

హాస్టల్ విద్యార్థులు పదిలో వందశాతం ఉత్తీర్ణత

డివిజన్ స్థాయిలో ప్రధమశ్రేణిలో నెంబర్ వన్ వార్డెన్ బోధనలతో విద్యార్థుల ప్రతిభ





శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూలై25(విజయస్వప్నం.నెట్)

సాంఘిక సంక్షేమ సమీకృత శాఖ బాలుర వసతి గృహం వార్డెన్ డి.రవీంద్రనాథ్ రెడ్డి ప్రత్యేక శిక్షణ, క్రమశిక్షణ, విద్యా భోధనలతో ఓడిచెరువు మండల కేంద్రానికి సమీపంలో(వడ్డివారిపల్లి వద్ద)ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ సమీకృత బాలుర వసతి గృహంలో పదవ తరగతిలో 12 మంది విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొన్నారు.డివిజన్(జిల్లా)స్థాయిలో 2023-24  పది ఫలితాల్లో 8మంది విద్యార్థులు ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణత,ద్వితీయ శ్రేణిలో నలుగురు ఉత్తీర్ణత సాధించడంతో ఓడిచెరువు సాంఘిక సంక్షేమ సమీకృత బాలుర వసతి గృహం ముందు వరుసలో నిలవడం మండలవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పదిలో 12 మంది విద్యార్థులు ఉత్తీర్ణత 2023-24 విద్యా సంవత్సరంలో మండల కేంద్రంలో ప్రభుత్వ జిల్లా ఉన్నత పరిషత్ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న 12 మంది విద్యార్థులకు,సాంఘిక సంక్షేమ సమీకృత బాలుర వసతి గృహంలో హాస్టల్ వార్డెన్ రవీంద్రనాథ్ రెడ్డి ప్రతి రోజూ ప్రత్యేక తరగతులు నిర్వహించి,క్రమశిక్షణతో కూడిన శిక్షణతో విద్యా భోధనలు అందించడమే కాకుండా,మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించి, ఉల్లాసంగా,ఉత్సాహం కోసం విద్యార్థులకు క్రీడలు నిర్వహించి ఆత్మ స్థైర్యం నింపి బోధనలు అందించి వసతి గృహంలో సేవా కార్యక్రమాలు  అలవర్చడంతో ఉత్తమ ఫలితాలు సాధింస్తారని వార్డెన్ రవీంద్రనాథ్ రెడ్డి అభిప్రాయాన్ని పలువురు ఏకీభవిస్తున్నారు.ఈయేడు పదవ తరగతిలో వసతి గృహంలో 12 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా ప్రధమ శ్రేణిలో 8మంది,ద్వితీయ శ్రేణిలో నలుగురు ఉత్తీర్ణత సాధించి డివిజన్ స్థాయిలో వంద శాతం ఉత్తమ ఫలితాలు సాధించిన సాంఘిక సంక్షేమ సమీకృత బాలుర వసతి గృహం ప్రధమ స్థానంలో నిలవడం విశేషం. వార్డెన్ బోధనలతో పెరిగిన విద్యార్థుల శాతం సమీకృత బాలుర వసతి గృహంలో వార్డెన్ రవీంద్రనాథ్ రెడ్డి ప్రత్యేక శిక్షణ తరగతులు,క్రమశిక్షణతో కూడిన విద్యా భోధనలు అందించడం, ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపడం,వంటశాలలో భోజనాలు తయారు చేసే సిబ్బందికి దగ్గర వుండి రుచి శుచికరంగా మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించడంతో విద్యార్థులను వసతి గృహంలో చేర్పించేందుకు తల్లిదండ్రులు ముందుకు రావడం విశేషం.ప్రస్తుతం విద్యా సంవత్సరంలో 6 నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల శాతం 95 మంది చేరడం(కేవలం 5 మంది విద్యార్థులు మాత్రమే చేరడం తరువాయి)విశేషంగా వుంది.

$$$__________@@@__________$$$

విద్యార్థులు క్రమశిక్షణతో చదవాలి:మోడల్ స్కూల్ విద్యార్థినీలకు అవగాహన కల్పించిన సిఐ

అమడగూరు జనసేన వార్త జూలై25(విజయస్వప్నం.నెట్)

మండలంలోని మోడల్ స్కూల్ లో సిఐ రాజేంద్రనాథ్ యాదవ్ ఆధ్వర్యంలో గురువారం విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి క్రమశిక్షణ అలవర్చుని విద్యా అభ్యసించి కళాశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని పేర్కొన్నారు. ఏలాంటి చెడు వ్యాపకాలకు గురికాకుండా,పరిచయం లేని వారితో అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు, ఆడపిల్లలకు గుడ్ టచ్, బాడ్ టచ్ ల గురించి వివరించారు. ముఖ్యముగా విద్యార్థి దశ నుంచే సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ శ్రీనివాసులు, జమేధర్ సుధాకర్, విజయ్ కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

ఘనంగా మొహర్రం వేడుకలు

శ్రీసత్యసాయిజిల్లా,అమడగూరు(ఓడిచెరువు)జూలై25(విజయస్వప్నం.నెట్)

మండల కేంద్రంలోని పీర్లచావిడి వద్ద గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ముజావర్లు రఫీ ఖాన్ మాట్లాడుతూ ఈఅన్నదాన కార్యక్రమానికి సహాయం చేసిన అమడగూరు గ్రామ ప్రజలకు ముఖ్యంగా యువతకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.గ్రామ ప్రజల సహకారంతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగిందని,ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసిన  గ్రామ పెద్దలకు,పోలీస్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ముజావర్లు మేకల భాష,రఫీఖాన్,చాంద్ బాషా,గ్రామస్తులు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

కదిరి పోలీసుస్టేషన్లో తనిఖీ చేపట్టిన జిల్లా ఎస్పీ



శ్రీసత్యసాయిజిల్లా(ఓడిచెరువు)కదిరి జూలై25(విజయస్వప్నం.నెట్)

కదిరి పట్టణం వన్ టౌన్ పోలీసుస్టేషన్ ను గురువారం శ్రీసత్యసాయిజిల్లా ఎస్పీ వి.రత్న ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు.డిఎస్పీ శ్రీలత, టౌన్ సిఐ పుల్లయ్య,రూరల్ సిఐ వెంకటేశ్వర్లు ఎస్పీ వి.రత్నకు పుష్పగుచ్ఛాలు అందించి సాదరంగా స్వాగతం పలికారు. పోలీసుస్టేషన్ లో  చెరశాల,కంప్యూటర్ గదులు, రికార్డులను ఎస్పీ పరిశీలించారు.అనంతరం ఎస్పీ మాట్లాడుతూ....యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్నారని,వాహనాలపై అతివేగంగా విచ్చలవిడిగా డ్రైవింగ్ చేయడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని వీటిపైన ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు.కదిరికి ఎక్కడ నుండి ఎవరు రవాణా చేసి మత్తు పదార్థాలు విక్రయిస్తున్నారని నిఘా వుంచి తమ పోలీస్  సిబ్బందితో స్పెషల్ డ్రైవ్ చేసే విధంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈకార్యక్రమంలో ఎస్ఐలు, పోలీసులు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

మహమ్మదాబాదులో ఎలుగుబంటి సంచారం

భయాందోళనలలో గ్రామ ప్రజలు


శ్రీసత్యసాయిజిల్లా,అమడగూరు(ఓడిచెరువు)జూలై25(విజయస్వప్న.నెట్)

మండలంలోని మహమ్మదాబాద్ పంచాయతీ గ్రామ సమీప నల్లగుట్టలో ఎలుగుబంట్లు సంచారిస్తు విషయం తెలుసుకున్న గ్రామస్తులు భయాందోళనలు చెందుతున్నారు.గతంలో గ్రామానికి చెందిన ఓ మహిళపై ఎలుగుబంటి దాడి చేయడంతో అప్రమత్తమై ప్రాణాలు అరచేతిలో పట్టుకొని మహిళ తప్పించుకొన్నట్లు తెలిపారు. తరచుగా గ్రామ సమీపంలో నల్లగుట్టలో ఎలుగుబంట్లు సంచారిస్తు పొలాల్లో పంటలను నష్టపరుస్తున్న విషయంపై అటవీ అధికారులు స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.ఆరుబయట ఆడుకునే చిన్నారులపై,ఒంటరిగా పొలానికి వెళ్ళే వారిపై ఎలుగుబంట్లు ఎటువైపు నుంచి దాడులు చేస్తాయోనని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అటవీ అధికారులు స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

$$$__________@@@__________$$$

ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవాలు అందిస్తా

- ఏడీసిసీ బ్యాంక్ మేనేజర్  టి.గోపాల్

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూలై25(విజయస్వప్నం.నెట్)

మండల ప్రాథమిక వ్యవసాయ పరస్పర సహకార(ఏడిసిసీ)బ్యాంక్ మేనేజర్ గా రెండు రోజుల క్రితం టి.గోపాల్ భాధ్యతలు స్వీకరించారని తెలిపారు. ముదిగుబ్బ బ్రాంచ్ నుండి ఓడిచెరువు బ్రాంచ్ మేనేజర్ భాధ్యతలు చేపట్టినట్లు ఆయన తెలిపారు.రైతులకు, ఖాతాదారులకు, మహిళా సంఘాల గ్రూపు సభ్యులకు నిరంతరం అందుబాటులో ఉంటూ సేవాలు అందిస్తారని పేర్కొన్నారు.

$$$__________@@@__________$$$

ఆధార్ అప్డేట్ సేవలు సద్వినియోగం చేసుకోండి 

అమడగూరు,జనసేన వార్త, జూలై26

మండలంలోని మహమ్మదాబాదు  గ్రామ సచివాలయాన్ని పరిశీలించి,ఆధార్ అప్డేట్ సేవలు సద్వినియోగం చేసుకోవాలని స్పెషల్ ఆఫీసర్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఆధార్ కార్డులో పేర్లు, చిరునామా,చరవాణి అంకెలు, సవరణలు తదితర వివరాలు   మార్చుకోవచ్చని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎన్.అశోక్ కుమార్ రెడ్డి, ఎంఈఓ జీలన్ బాషా, డిజిటల్ అసిస్టెంట్ అశోక్, చంద్రశేఖర్, విజయకుమారి,పంచాయతీ గ్రామ కార్యదర్శి సునియా, మహిళా పోలీసు జ్యోతి,సిబ్బంది చిన్నారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

$$$__________@@@__________$$$

ఈనెల 31న ఉచిత గుండె వైద్యశిబిరం

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూలై26(విజయస్వప్నం.నెట్)

మండలంలోని కొండకమర్ల పంచాయతీ గ్రామ ఉర్దూ పాఠశాలలో ఉచిత వైద్యశిబిరం నిర్వహించనున్నట్లు గ్రామ పెద్దలు శుక్రవారం ఓప్రకటనలో తెలిపారు.లైఫ్ లైన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మార్క్ సూపర్ స్పెషాలిటీ గుండె ఆసుపత్రి వైద్యులతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి గుండె నొప్పి, ఛాతీ నొప్పి, గుండె దడ, ఆయాసం, గుండెలో మంట, ఛాతీలో బరువుగా వుండడం,కాలు వాపులు రావడం, చెమటలు పట్టడం తదితర వ్యాధులకు చికిత్స అందిస్తారని,అలాగే ‍ బ్లడ్ షుగర్, బిపి, ఈసీజీ, 2డి ఎకో ద్వారా వైద్య సేవలు అందిస్తారని కార్యనిర్వహాకులు సాథక్ బాషా,అబ్లు, జావేద్, ఆట ఉల్లా సర్, సాదిక్ లు పేర్కొన్నారు.31 బుధవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వైద్య శిబిరంలో వైద్య పరీక్షలు నిర్వహిస్తారని, వివిధ వ్యాధుల చికిత్సలకు ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని, కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

$$$__________@@@__________$$$

ఆర్ఎంపీలు నిబంధనలతో చికిత్స సేవలందించాలి



శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు జూలై26(విజయస్వప్నం.నెట్)

వైద్య ఆరోగ్యశాఖ తనిఖీ బృందం శుక్రవారం మండలవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎంపీలు నిర్వహిస్తున్న ప్రథమ చికిత్స కేంద్రాలను తనిఖీ చేశారు.ఆర్ఎంపీలు తగిన అర్హత కలిగి వుండి ప్రభుత్వ నియమ, నిబంధనలను అనుసరిస్తూ ప్రజలకు చికిత్స సేవలందించాలని డాక్టర్ జోత్స్నా,డాక్టర్ సునీల్ సూచించారు. గ్రామాల్లో ఆర్ఎంపీలు నిర్వహిస్తున్న చికిత్స కేంద్రాలను,వారి సర్టిఫికెట్లను  పరిశీలించి నివేదికను తయారు చేసి జిల్లా ఉన్నతాధికారులకు అందించనున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో మండల వైద్యాధికారి కమల్ రోహిత్,ఆరోగ్య విస్తరణాధికారి నాగేష్, ఆరోగ్య, విద్య  బోధకులు సుశీలమ్మ, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.