సూర్యచంద్రప్రభల్లో శ్రీలక్ష్మనరసింహుడు
కదిరి పట్టణంలో వెలిసిన శ్రీమత్ ఖాద్రీ లక్ష్మినరసింహ స్వామి పుణ్యక్షేత్రంలో ఈనెల 19 నుండి ఏప్రిల్ 2 వరకు పక్షం రోజులు వైభవంగా నిర్వహించే స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమంలో భాగంగా మంగళవారం 8వరోజు శ్రీలక్ష్మీనరసింహస్వామివారు సూర్యచంద్రప్రభ వాహనంపై పురవీధుల్లో ఊరేగింపుగా భక్తులకి దర్శనమిచ్చారు.వివిధ పుష్ప్వాల అలంకరణతో ఉదయం సూర్యకాంతిలో శ్రీలక్ష్మీనరసింహస్వామివారు పల్లకిలో కొలువై ఊరేగింపుగా పురవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు.రాత్రి చంద్రప్రభ శోభిల్లే పల్లకిలో ఆసీనులై భక్తులకు దర్శనం ఇస్తూ మంత్రి ముగ్ధులను చేశారు. రాత్రివేళలో ఆలయంలో కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు.నేడు బుధవారం 9రోజు శ్రీలక్ష్మీసింహస్వామివారి మోహిని ఉత్సవ ఊరేగింపుగా దర్శనమిస్తారని ఆలయ అర్చకులు, కార్యనిర్వాహకులు అర్చకులు తెలిపారు.
$$$__________@@@__________$$$
ఓడిచెరువు మండల పరిధిలోని గాజుకుంటపల్లి సమీపంలో మంగళవారం ఎస్ఐ వంశీకృష్ణ పోలీసులతో కలిసి వాహనాలను ఆకస్మికంగా తనిఖీ చేసి లైసెన్సులు తదితర రికార్డులు పరిశీలించారన్నారు.జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రాబోయే ఎన్నికల దృష్ట్యా వాహనాలను తనిఖీలు నిర్వహించారని ఈసందర్భంగా ఆయన తెలిపారు.ఎన్నికల కమిషన్ నియమాలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు.
$$$__________@@@__________$$$
వైకాపా నుండి తెదేపాలోకి వందలాది మంది చేరిక....!
తెదేపాలోకి ఆహ్వనించిన మాజీమంత్రి పల్లె
శ్రీసత్యసాయిజిల్లా,పుట్టపర్తి మార్చి26(విజయస్వప్నం.నెట్)
ఓడిచెరువు మండలంలో వైకాపా నుండి తెదేపాలోకి మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సమక్షంలో మంగళవారం భారీగా చేరారు.మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి,పుట్టపర్తి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి,పల్లె వెంకట కృష్ణ కిషోర్ రెడ్డి,జనసేన పుట్టపర్తి నియోజకవర్గ ఇన్చార్జ్ పత్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో 200 కుటుంబాల నాయకులు, కార్యకర్తలు వైకాపాను వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ముందుగా ఓడిచెరువు మండల కేంద్రంలో తెదేపా శ్రేణులు భారీగా బైక్ ర్యాలీ నిర్వహించి, అనంతరం ఎస్బిఐ సమీపంలో ఏర్పాటు చేసిన సభ వేదికలో పాల్గొని మాజీమంత్రి పల్లె,ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, పల్లె కృష్ణ కిషోర్ రెడ్డి మాట్లాడుతూ.…
$$$__________@@@__________$$$
శ్రీస్వామివారికి నీరాజనం కరపత్రాలు విడుదల
శ్రీసత్యసాయిజిల్లా కదిరి మార్చి 26(విజయస్వప్నం.నెట్)
కదిరి పట్టణంలో ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలలో ప్రహ్లాద సమేత శ్రీ మత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానంలో శ్రీ స్వామివారికి నీరాజనం పాట విడుదల చేశారు.శ్రీవారికి ప్రతిఏటా ఫాల్గుణ మాసంలో 15 రోజుల పాటు అత్యంత వైభవంగా శ్రీవారికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.ఈ బ్రహ్మోత్సవాల వైభవాన్ని శ్రీ వారి భక్తులకు మరింత చేరువ చేయాలని ప్రతిఏటా తమవంతుగా రచయిత చిన్నారావు ఆధ్వర్యంలో గాయకులు శ్రీ పూర్ణచంద్ర ( హైదరాబాద్) కార్తికేయ డిజిటల్స్ కార్తిక్,చక్రిల సహకారంతో శ్రీస్వామి వారికి నీరాజనం పేరుతో ఒక పాటను మంగళవారం శ్రీ మధ్ ఖాద్రీ లక్ష్మినరసింహస్వామి వారి ఆలయంలో ఆలయ ఈవో వెండి దండి శ్రీనివాసుల రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు నరసింహ వసంతా చార్యుల చేతుల మీదుగా ప్రారంభించి అనంతరం స్వామివారి …
$$$__________@@@__________$$$
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మాథహర్చి26(విజయస్వప్నం.నెట్)
ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి సతీమణి దుద్దుకుంట అపర్ణ రెడ్డి నేడు బుధవారం ఉదయం 8:30 గంటలకు నల్లమాడ మండలంలోని చౌటకుంటపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గోంటారని. కావున ఈ కార్యక్రమానికి వైస్సార్సీపీ కుటుంబ సభ్యులందరు తప్పకుండా హాజరు కావాలని బుధవారం ఎమ్మెల్యే కార్యాలయం కార్యదర్శులు ఓ ప్రకటనలో తెలిపారు.
$$$__________@@@__________$$$
భార్యతో గొడవపడి.... ఉరివేసుకుని ఆత్మహత్య.
ఇడగొట్టు భూపతి(36) |
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు మార్చి26 (విజయస్వప్నం.నెట్)
మండలంలోని బాలప్పగారిపల్లికి చెందిన ఇడగొట్టు గంగులప్ప కుమారుడు ఇడగొట్టు భూపతి(36)అనే యువకుడు నిరంతరం తాగుడుకు బానిసై సోమవారం రాత్రి భార్యతో గొడవపడి మనస్తాపం చెంది బార్య ఇంటి ముందు నిద్రపోతున్న సమయంలో అతను ఇంట్లో తలుపులు మూసి సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. బార్య అశ్విని పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి