29, ఫిబ్రవరి 2024, గురువారం

విద్యార్థుల వైజ్ఞానిక అద్భుత ప్రతిభ ప్రదర్శనలు ఆకట్టుకున్న సైన్స్ ఎగ్జిబిషన్ - మార్చి మొదటి వారం నుండి ఒంటిపూట ఒడులు నిర్వహించాలి: డిటిఎఫ్ - అనారోగ్యంతో వీఆర్వో శివప్ప మృతి

అనారోగ్యంతో వీఆర్వో శివప్ప మృతి

     శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు ఫిబ్రవరి28(విజయస్వప్నం.నెట్)

vro shivappaఓడిచెరువు పంచాయతీ గ్రామ సచివాలయం-2 వీఆర్వోగా విధులు నిర్వహిస్తున్న తలారి శివప్ప గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం అర్ధరాత్రి స్వగృహం తంగేడుకుంట గ్రామంలో మృతి చెందినట్లు రెవిన్యూ సిబ్బంది తెలిపారు. తహశీల్దార్ ఖాజాబీ,రీసర్వే డిప్యూటీ తహసీల్దార్ జాకిర్,ఆర్ఐ నాగేంద్ర,వీఆర్వోలు గ్రామానికి వెళ్లి తలారి శివప్ప మృతదేహానికి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. వీఆర్వో తలారి శివప్ప మృతి విషయం తెలుసుకొన్న మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి తంగేడుకుంట గ్రామానికి వెళ్లి మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి,కుటుంబ సభ్యులను పరామర్శించి దైర్యం చెప్పి ఓదార్చారని తెదేపా శ్రేణులు తెలిపారు

______________________________

విద్యార్థులకు బహుమతులు ప్రదానం 

శ్రీసత్యసాయిజిల్లా, తలుపుల, ఫిబ్రవరి28(విజయస్వప్నం.నెట్)

మండల కేంద్రంలో బుధవారం జాతీయ వైజ్ఞానిక దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆహార భద్రత సాధన, విజ్ఞాన శాస్త్రవేత్తల కృషి అంశంపై వ్యాసరచన పోటీలు 6 నుంచి 8వ తరగతి విద్యార్థులకు నిర్వహించి, ప్రతిభ కనబరచిన విద్యార్థులకు  బహుమతులు ప్రదానం చేసినట్లు ఉపాధ్యాయ బృందం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్సీఎస్టీసీ, ఏపి కాస్ట్, డీఎస్టీ శ్రీ సత్య సాయి జిల్లా సైన్స్ బృందం  సహకార పర్యవేక్షణలో నిర్వహించరన్నారు.పాఠశాల విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయులు పి.భాస్కర్, తలమర్ల ప్రభాకర్, డి.దివాకర్  ఉపాధ్యాయ బృందం పాల్గోని కార్యక్రమాన్ని నిర్వహించరన్నారు.

______________________________

విద్యార్థుల వైజ్ఞానిక అద్భుత ప్రతిభ ప్రదర్శనలు

ఆకట్టుకున్న సైన్స్ ఎగ్జిబిషన్

శ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు, ఫిబ్రవరి28(విజయస్వప్నం.నెట్)

అంతర్జాతీయ వైజ్ఞానిక దినోత్సవం సందర్భంగా బుధవారం మండల వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్ లో విద్యార్థుల ప్రయోగాల ప్రదర్శనలు ఆకట్టుకోన్నాయి. స్థానిక విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో సైన్స్ ప్రదర్శన ఎంఈఓ-1 రమణ తిలకించారు. ఈ సందర్భంగా ఐఐటి ఏడవ తరగతి చదువుతున్న షేక్.సుహన నీటి కాలుష్యం పైన ప్రయోగించిన ప్రదర్శన ఆకట్టుకుంది. నీటి కాలుష్యంపై నిర్వహించిన ప్రదర్శన చూసిన  ఎంఈఓ విద్యార్థిని షేక్ సుహనను అభినందించారు. వశిష్ఠ పాఠశాలలో విద్యార్థుల తయారుచేసిన ప్రాజెక్టులు విద్యాధికారులు తిలకించారు. వేమారెడ్డిపల్లి సమీపంలో రెయిన్బో పాఠశాలలో సైన్స్ డే సందర్బంగా విద్యార్థులు తయారుచేసిన ప్రాజెక్టులు కౌంటర్లు ఏర్పాటు చేసిన ప్రయోగాలు ప్రదర్శించారు. శ్రీ విజ్ఞాన్ సీబిఎస్ పాఠశాలలో ప్రాజెక్టులు ప్రదర్శించిన విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏంఈఓ కరస్పాండెంట్ సాహేరాబాను, మార్గానుగుంట్ల ఫక్రుద్దీన్ హెడ్మాస్టర్ శ్రీనివాసులు, ఏవో మల్లికార్జున్రెడ్డి, ఉపాధ్యాయులు రఘు,బాలాజీ, రెయిన్బో,వశిష్ట, మస్తాన్ సిబిఎస్ పాఠశాలల కరస్పాండెంట్లు జయసింహారెడ్డి, మస్తాన్, పిట్ట శివశంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

______________________________

మార్చి మొదటి వారం నుండి ఒంటిపూట ఒడులు నిర్వహించాలి: డిటిఎఫ్

శ్రీసత్యసాయిజిల్లా ఫిబ్రవరి28(విజయస్వప్నం. నెట్)

రాష్ట్రంలో పాఠశాలలకు ప్రతి ఏడాది మార్చి15 నుండి ఒంటి పూట బడులు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని అయితే ఈయేడు  ముందుగానే వేసవికాలం వచ్చినట్లుందని, గతంలో కంటే ఇప్పటికే ఎండలు త్రీవంగా ఉన్నాయని, విద్యార్థులు ఎండ వేడిమితో ఇబ్బందులు పడే  పరిస్థితి ఉన్నందున మార్చి మొదటి వారం నుండి ఒంటిపూట ఒడులను  నిర్వహణకు ఆదేశాలు జారీ చేయాలి అని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నట్లు (ఓడిచెరువు మండలానికి చెందిన ఉపాధ్యాయ సంఘం నాయకులు) శ్రీసత్యసాయి జిల్లా డిటిఎఫ్ అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు గౌస్ లాజామ్, మారుతి, సబ్ కమిటీ సభ్యులు షర్ఫోద్దిన్,సురేష్ బాబు,రామకృష్ణ,వెంకట చలమయ్య,నాగరాజు బుధవారం విలేకరులకు ప్రకటనలో తెలిపారు.

______________________________

తలుపుల విద్యార్థులకు జిల్లా స్థాయిలో ద్వితీయ బహుమతి

శ్రీసత్యసాయిజిల్లా,తలుపుల ఫిబ్రవరి28(విజయస్వప్నం.నెట్ )

ఈఎండీపీ సైన్స్ ఎక్సపో -2024 జిల్లాస్థాయి కార్యక్రమాన్ని  శ్రీసత్యసాయి జిల్లా విద్యాశాఖ అధికారి మీనాక్షి బుధవారం  కొత్తచెరువు బాలుర పాఠశాలలో ప్రారంభించారు.ఈకార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాల విద్యార్థులు వారి వారి ప్రాజెక్టులను ప్రదర్శించగా, జిల్లా స్థాయిలో అత్యుత్తమ ప్రాజెక్టులు ఎంపికైన వాటిలో తలుపుల ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు రూపొందించిన హాండ్స్ ఫ్రీ యూరినల్స్ అనే ప్రాజెక్టు జిల్లా స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచి బహుమతిని గెలుచుకొన్నారని,త్వరలో విజయవాడలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీలలో విద్యార్థులు పాల్గొననున్నారని ఉపాధ్యాయులు తెలిపారు.

______________________________

శ్రీసత్యసాయిజిల్లా(విజయస్వప్నం.నెట్)

ఓడిచెరువు మండలంలోని మిట్టపల్లి, మామ్మిళ్లకుంట్లపల్లి గ్రామాల్లో చేపట్టిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులను బుధవారం డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయప్రసాద్ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.... వేసవికాలం సమీపిస్తుండడంతో ఉపాధి పనులు చేపట్టే ప్రదేశాల్లో నీడ,నీరు,ప్రధమ చికిత్స  తదితర సౌకర్యాలు కల్పించాలని, వ్యవసాయ తక్కువ ఉన్నందున కూలీలకు పనులు కల్పించి, వలసలు నివారించాలని ఉపాధి సిబ్బందికి సూచించారని ఏపిడి శ్రీనివాసులురెడ్డి,అసిస్టెంట్ ఏపిడి ప్రతాప్ రెడ్డి తెలిపారు. ఏపీఓ సుధాకర్, సాంకేతిక సహాయకులు రాజారెడ్డి, ఆంజనేయులు, హనుమంతరెడ్డి, రాజేంద్ర, చంద్రారెడ్డి, క్షేత్ర సహాయకులు పాల్గొన్నారు.

______________________________

కర్రె రవిశంకర్

కర్రె రవిశంకర్

శ్రీసత్యసాయిజిల్లా ఫిబ్రవరి28, నల్లచెరువు (విజయస్వప్నం.నెట్)

శ్రీసత్యసాయి జిల్లా ఆర్య వైశ్య సంఘం పొలిటికల్ వైస్ చైర్మన్ గా నల్లచెరువు మండలానికి చెందిన కర్రె రవిశంకర్ ను బుధవారం ఎంపికపై వాసవి ఆర్య వైశ్య సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు.జిల్లా ఆర్య వైశ్య సంఘం పొలిటికల్ వైస్ చైర్మన్ గా ఎంపిక చేసిన రాష్ట్ర,అనంత, శ్రీసత్యసాయి ఉమ్మడి జిల్లాల సంఘం ప్రతినిధులకు వైస్ చైర్మన్ కర్రె రవిశంకర్ కృతజ్ఞతలు తెలిపారు.రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే,ఎంపీ సీట్లు కేటాయించి, అలాగే స్థానిక సంస్థల్లో అన్ని రంగాలలో ఆర్య వైశ్యలకు ప్రాధాన్యత కలిపించాలని ఆయన కోరారు.కదిరి ఆర్య వైశ్య సంఘం నాయకులకు, వివిధ గ్రామ, మండల, డివిజన్ ఆర్య వైశ్య సంఘం నాయకులకు, సోదరులకు ధన్యవాదాలు తెలిపారు. ఈనెల 2న హిందూపురంలో శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షులుగా రాము ప్రమాణం స్వీకారం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొంటూ... ప్రతి ఒక్కరు కార్యక్రమంలో పాల్గోని విజయవంతం చేయాలని ఆయన ఈసందర్బంగా పిలుపునిచ్చారు.

28, ఫిబ్రవరి 2024, బుధవారం

మాజీమంత్రి పల్లె ఆధ్వర్యంలో రా.... కదలిరా....

 మాజీమంత్రి పల్లె ఆధ్వర్యంలో రా.... కదలిరా.... భారీ బైక్ ర్యాలీ



palle raghunath reddy

 తెదేపా శ్రేణులతో విద్యుత్ కేంద్రాన్ని ముట్టడి  

 ఇనుగలూరు పంచాయతీలో పలువురు వైకాపా నుండి తెదేపాలో చేరిక 

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఫిబ్రవరి27(విజయస్వప్నం.నెట్)

ఓడిచెరువు మండలంలోని ఇనగలూరు, గొల్లపల్లి గ్రామాలకు చెందిన వైసీపీ నుండి తెదేపాలోకి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సమక్షంలో  చేరారు.ఇనగలూరు,గొల్లపల్లి గ్రామాలకు చెందిన దాదాపు 53 కుటుంబాలు మంగళవారం వైసీపీనీ వీడీ మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సమక్షంలో టీడీపీ కండువాలు కప్పుకొని పార్టీలోకి చేరారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా మాజీ మంత్రి పల్లెతో పాటు మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప,నియోజకవర్గ పరిశీలకులు మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య,పార్థసారథి రెడ్డి హాజరయ్యారు.ఈ సంధర్భంగా మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి  రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సాగిస్తున్న అరాచక పాలనకు స్వస్తి పలకాలని ప్రజలకు పిలపునిచ్చారు.వైకాపా తిరిగి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందన్నారు. వైకాపా ప్రభుత్వంలో విద్యుత్ చార్జీలు,బస్ చార్జీలు,చెత్త పన్ను,నిత్యవసర సరుకులు భారీగా పెంచి ప్రజలకు మరింత భారం విధించారన్నారు.మీ పిల్లల భవిష్యత్ బాగుండాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి ,పుట్టపర్తి లో పల్లె రఘునాథ్ రెడ్డి నీ ఎమ్మెల్యేగా ఆశీర్వదించాలని కోరారు.అనంతరం గ్రామంలో రా.... కదలిరా....కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి పల్లె ఆధ్వర్యంలో తెదేపా శ్రేణులు ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించి వైకాపా తిరిగి మళ్ళీ అధికారంలోకి వస్తే రాష్ట్రం  రావణకాష్టంలా, అంధకారంగా,అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మారడం ఖాయమని,టీడీపీ అధికారంలోకి తీసుకొని రావాలని,చంద్రబాబుతోనే మీ భవిష్యత్తుకు గ్యారంటీ, రాష్ట్ర అభివృద్ధి చెందుతోందని ప్రచారం చేపట్టారు.రోడ్డు ప్రమాదంలో గాయపడినవారికి, అనారోగ్యంతో చికిత్సలు పొందుతున్న వారికి తదితర భాదిత కుటుంబ సభ్యులను పరామర్శించి,తెదేపా అండగా ఉంటుందని మాజీమంత్రి పల్లె భరోసా కల్పించి ఆర్థికసాయం చేశారుకార్యక్రమంలో మండల కన్వీనర్ జయచంద్ర, మాజీ జెడ్పీటీసీ పిట్టా ఓబుళరెడ్డి,సర్పంచ్ శంకర్ రెడ్డి, ఎంపిటిసి శ్రీనివాసులు, మాజీ ఎంపిటిసిలు రామానాయుడు, రాజారెడ్డి,పీట్ల సుధాకర్,టైలర్ నిజాం,సాంబ శివారెడ్డి,నారపరెడ్డి,మహబూబ్ బాషా,కంచి సురేష్,గంటా శ్రీనివాసులు,సౌదీ నాగరాజు, ఆరీఫ్,కుమార్ రాయల్, 

భాస్కర్ రెడ్డి  ,మోహన్ రెడ్డి , చంద్రారెడ్డి, గంగిరెడ్డి , సుదర్శన్ రెడ్డి, శివారెడ్డి,రమణ రెడ్డి ,మస్థానమ్మ, అఖిల, బాగ్యమ్మ, పాపమ్మ, సాలెమ్మ తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ కేంద్రాన్ని ముట్టడించిన తెదేపా శ్రేణులు    మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం తెదేపా నాయకులు, కార్యకర్తలు, రైతులు భారీగా తరలివచ్చి అనధికారిక విద్యుత్ కోతలను నిరసిస్తూ మండల విద్యుత్ ప్రధాన కేంద్రాన్ని ముట్టడించారు. ప్రస్తుతం రబి సీజన్లో బోరు బావుల కింద సాగుచేసిన పంటలు విద్యుత్ కోతల కారణంగా ఎండిపోయాయని, అప్పులు చేసి  పంటలు సాగు చేస్తే విద్యుత్ కోతల కారణంగా చేతికందే సమయంలో నీరందాక పంటలు పూర్తిగా ఎండిపోతున్నాయని, 9గంటలనాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. అనంతరం ఏఈ రామసురారెడ్డికి వినతిపత్రం అందజేశారు. అంతక ముందు తెదేపా పుట్టపర్తి ఇంచార్జ్, మాజీమంత్రి పల్లె ఆధ్వర్యంలో తెదేపా నాయకులు, కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.

______________________________

శ్రీసత్యసాయిజిల్లా,కదిరి ఫిబ్రవరి27(విజయస్వప్నం.నెట్)

కదిరి పట్టణంలో బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు మంగళవారం  అంపాపతి గోవిందు ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి బహుజన సమాజ్ పార్టీ  శాసనసభ అభ్యర్థి ప్రసాద్ ఎన్నికల గుర్తు, పార్టీ చిహ్నం రంగులతో ముద్రించిన పోస్టర్లు విడుదల చేశారు.బిఎస్పి పార్టీ గెలుపు కోసం శ్రమించి నియోజకవర్గంలో బిఎస్పి జెండా ఎగురావేస్తారమన్నారు.

______________________________

శ్రీసత్యసాయిజిల్లా,కదిరి, ఫిబ్రవరి27(విజయస్వప్నం.నెట్)

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ హెరిటేజ్ యూనివర్సిటీ 45వ వార్షిక ఇంటర్ నేషనల్ సెమినార్  నిర్వహక ప్రతినిధులచే కదిరి పట్టణంలో వెలసిన ప్రసిద్ధి శ్రీ మధ్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానం ఉపప్రధాన అర్చకులు శ్రీ కుమార్ రాజా ఆచార్యుల వారికి ధర్మ ప్రచారంలో తన సేవలను గుర్తింపుగా గౌరవ డాక్టరేట్  పురస్కారం ప్రధానం చేసిన సందర్భంగా శ్రీ  అర్చకం కుమార్ రాజా ఆచార్యుల వారి స్వగృహంలో మంగళవారం కదిరి సేవాదళ్ యువసేవకులు కుటాల లక్ష్మణ్ తదితరులు మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారన్నారు.


______________________________

ఎమ్మెల్యే సతీమణి దుద్దుకుంట అపర్ణ రెడ్డి దొన్నికోటలో ప్రచారం

 ఘన స్వాగతం పలికిన వైసిపి శ్రేణులు

శ్రీసత్యసాయిజిల్లా,నల్లమాడ ఫిబ్రవరి27(విజయస్వప్నం.నెట్)

మండల పరిధిలోని దొన్నికోట, గూడమేకలపల్లి, చెర్లోపల్లి  గ్రామాలలో మంగళవారం పుట్టపర్తి శాసన సభ్యులు దుద్ధుకుంట శ్రీధర్ రెడ్డి సతీమణి అపర్ణ రెడ్డి ఎన్నికల ప్రచారం చెప్పారు.కార్యకర్తలు,మహిళలతో కలిసి దొన్నికోట పంచాయితీలోఆమె జోరుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.పుట్టపర్తిని అన్ని విధాలుగా శ్రీధర్ రెడ్డి అభివృద్ధి చేసారని,మరోసారి  ఓటు వేసి ఆశీర్వదించి గెలిపిస్తే.... మరింత అభివృద్ధి చేసి చూపిస్తాడని ఆమె ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరికి తెలిపారు.పుట్టపర్తితోపాటు నియోకవర్గస్థాయిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు నిధులను తీసుకొచ్చిన ఘనత శ్రీధర్ రెడ్డికే  దక్కిందన్నారు.ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న మన ముఖ్యమంత్రి జగనన్నని, మీ బిడ్డ శ్రీధర్ రెడ్డిని మరొక్కసారి ఆశీర్వదించాలని గ్రామ ప్రజలను ఆమె కోరారు. ఈ ఎన్నికల్లో మరో సారి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి మీ బిడ్డ శ్రీధర్ రెడ్డిని తిరిగి భారీ మెజారిటీతో  ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రచారం చేపట్టారు..ప్రచారంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

__________________________________

లంచం తీసుకొంటు ఏసీబికి పట్టుబడిన ఆర్ఐ 

R I Kranthi Kumar

శ్రీసత్యసాయిజిల్లా/అనంతపురం ఫిబ్రవరి27(విజయస్వప్నం.నెట్)

అనంతపురంజిల్లా పామిడి మండల తహశీల్దార్ కార్యాలయంలో మంగళవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. పామిడి మండలంలోని అనుంపల్లి గ్రామానికి చెందిన శేషాద్రి అనే రైతు  ల్యాండ్ ముటేషన్ పట్టా పుస్తకం కొరకు దరఖాస్తు చేసుకున్నాడని, అయితే ల్యాండ్ మోటివేషన్ చేయాలంటే 10 వేలు లంచం  ఇవ్వాలని ఆర్ఐ క్రాంతి కుమార్ రైతును డిమాండ్ చేశాడని, దీంతో రైతు 6వేల రూపాయలకు బేరం  కుదుర్చుకుని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడని ఏసీబి డిఎస్పి వేంకటాద్రి తెలిపారు. దీంతో  ఆర్ ఐ క్రాంతి కుమార్ రైతు నుండి 6వేలు రూపాయలు లంచం తీసుకుంటుండగా మాటువేసి ఆర్ ఐ క్రాంతి కుమార్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారని తెలిపారు.ఆర్ఐ వద్ద నుండి 6వేల రూపాయలను స్వాధీనం చేసుకుని అతనిపై కేసు నమోదు చేసి ఏసిపి కోర్టు లో హాజరు పరుస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

27, ఫిబ్రవరి 2024, మంగళవారం

మార్చి 8న అక్కదేవతల ఆలయంలో ఉత్సవాలు

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఫిబ్రవరి 26(విజయస్వప్నం.నెట్)

ఓడిచెరువు మండలంలోని అల్లాపల్లి పంచాయతీ దాదిరెడ్డిపల్లి గ్రామ సమీపంలో సోమవతి నది ఒడ్డున వెలసిన శ్రీ సప్త అక్కదేవతల ఆలయంలో మార్చి 8న మహాశివరాత్రి  పురస్కరించుకొని పూజా కార్యక్రమంలో నిర్వహించే కార్యక్రమం వివరాలతో ప్రచురించిన కరపత్రాలను సోమవారం విడుదల చేసినట్లు పూజారి వెంకటేష్ తెలిపారు.శివరాత్రి పండుగ రోజు ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు అమ్మవారి ప్రత్యేక పూజ కార్యక్రమాలు,సాయంత్రం 5గంటల నుంచి 6 వరకు గిరిగుల పూజలు,రాత్రి 8 గంటలకు జ్యోతి కార్యక్రమం,9 గంటలకు భజన కార్యక్రమం,రాత్రి 10పది గంటల నుంచి ఆర్కెస్ట్రా తెల్లవారుజామున వరకు నిర్వహిస్తారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో భక్తాలు విశేషంగా పాల్గొని అమ్మవారి కృప పాత్రలు కాగలరని కోరుతూ.... ఆహ్వాన కరపత్రం విడుదల చేసారని పూజారి వెంకటేష్ తెలిపారు.ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

_____________________________

శివాలయానికి ఉత్సవ విగ్రహాలు వితరణ

శ్రీసత్యసాయిజిల్లా ఓబుళదేవరచెరువు గ్రామానికి చెందిన బొడ్డు సాంబశివ కుమారుడు బొడ్డు నాగరాజు, బొడ్డు అరుణ దంపతులు ఓడిచెరువు గ్రామంలోని బస్టాండ్ సమీపంలో వెలసిన శివాలయానికి గణపతి, పార్వతీ పరమేశ్వరుల  ఉత్సవ పంచంలోహ విగ్రహాలను సోమవారం పురోహిత పూజారి మురళీ స్వామి సమక్షంలో అందజేశారు. 

అంతక ముందు మాఘు మాస సోమవారం పురస్కరించుకొని ఉదయం ఏడు గంటల నుండి  దాతలు బొడ్డు నాగరాజు,బొడ్డు అరుణమ్మ దంపతులు ఉత్సవ వి గ్రహాలను స్వగృహం నుండి పురావిధుల గుండా మేళతాలతో శివాలయం వరకు దర్శనార్థం ఊరేగింపు నిర్వహించారు. శివాలయంలో ఉత్సవ విగ్రహాలకు అభిషేకం,అర్చన  వివిధ పుష్ప్హాలతో అలంకరణ చేసి భక్తిశ్రద్దలతో ప్రత్యేక పూజా కార్యక్రమములు నిర్వహించి, దర్శనం కోసం విచ్చేసిన భక్తులకు తీర్ద,అన్న ప్రసాదములు అందజేశారన్నారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు, పురప్రజలకు విగ్రహాల దాతలు బొడ్డు నాగరాజుతో పాటు కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.

_____________________________

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు, ఫిబ్రవరి26(విజయస్వప్నం.నెట్) 

మాజీమంత్రి,పుట్టపర్తి తెలుగుదేశంపార్టీ  ఇంచార్జ్ పల్లె రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో మండల కేంద్రంలో (నేడు) మంగళవారం ఉదయం 10:30 గంటలకు అనధికార విద్యుత్ కోతలను నిరసిస్తూ సబ్ స్టేషన్ ముట్టడి,అనంతరం పోలీస్ స్టేషన్ పక్కన  పెట్రోల్ బంక్ నుండి ఇనగలూరు వరకు బైక్ ర్యాలీ  నిర్వహించి,రా.... కదలిరా.... ప్రచార కార్యక్రమం చేపట్టనున్నట్లు పేర్కొంటూ.... నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీలు, బూత్ కమిటీ కన్వీనర్లు, మహిళా కార్యకర్తలు,యూనిట్ ఇన్చార్జిలు, అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని సోమవారం మండల తెదేపా శ్రేణులు విలేకరులకు తెలిపారు. శ్రీసత్యసాయిజిల్లా ఆమడగూరు మండలంలోని మాడిమెకులపల్లి, కంచనవారిపల్లి గ్రామాలకు చెందిన ఆదినారాయణరెడ్డి, కిష్టప్ప ఆధ్వర్యంలో వైకాపాకు చెందిన 10కుటుంబాలకు చెందిన కార్యకర్తలు ఆదివారం పుట్టపర్తి తెదేపా కార్యాలయంలో మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి సమక్షంలో తెదేపాలోకి చేరినట్లు తెలిపారు. నియోజకవర్గం పరిధిలోని మండలాలలో ప్రచార కార్యక్రమాలు మాజీమంత్రి పల్లె చేపడుతున్నట్లు తెలుగుదేశంపార్టీ శ్రేణులు తెలిపారు.

_____________________________

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఫిబ్రవరి 26(విజయస్వప్నం.నెట్)

మండలంలోని మిట్టపల్లి పంచాయతీ వణుకువారిపల్లి గ్రామానికి చెందిన  దేరంగుల రామకృష్ణ గుండెపోటుతో సోమవారం ఉదయం మృతి చెందిన విషయం తెలుసుకొన్న ఎమ్మెల్యే దుడ్డుకుంట శ్రీధర్ రెడ్డి తనయుడు దుడ్డుకుంట కిషన్ రెడ్డి గ్రామానికి వెళ్లి పార్థివ దేహానికి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను ఓదార్చి,ఆర్ధికసాయం అందజేశారని స్థానిక ప్రజాప్రతినిధులు, వైస్సార్సీపీ నాయకులు తెలిపారు.





_____________________________

శ్రీసత్యసాయిజిల్లా పుట్టపర్తి (విజయస్వప్నం.నెట్)

అనంత జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ సాధన బహిరంగసభకు శ్రీసత్యసాయిజిల్లా పరిధిలోని 7 నియోజకవర్గంలోని మండలాల నుండి భారీగా తరలివచ్చి విజవంతం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మహిళలకు, యువతకు జిల్లా కార్యదర్శి బొగ్గిటి మునికుమార్, పుట్టపర్తి డివిజన్ ఉపాధ్యక్షులు (ఓడిచెరువు మాజీ ఎంపిటిసి) తుమ్మల  మహబూబ్ బాష ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.




_____________________________

శ్రీసత్యసాయిజిల్లా ఆమడగూరు మండలంలో ఆదివారం పుట్టపర్తి శాసనసభ్యులు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి పర్యటించి కంచరవారిపల్లి గ్రామానికి చెందిన సోసైటీ అధ్యక్షులు బొమ్మిరెడ్డి సూర్యనారాయణరెడ్డి సోదరుడి కుమారుడు నరేష్ కుమార్ రెడ్డి నూతన గృహప్రవేశం పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.ఇదే గ్రామానికి చెందిన ఆదినారాయణ ఇటీవల తనకల్లు మండలం కొక్కంటి క్రాస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్ళు కోల్పోయి విశ్రాంతి తీసుకొంటున్న విషయం తెలుసుకొన్న ఎమ్మెల్యే దుద్దుకుంట భాదితుడు ఆదినారాయణ ఇంటికి వెళ్లి పరామర్శించి,సిఎం సహాయ నిధి ద్వారా సాయం అందిస్తామన్నారు, అలాగే గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న నూర్ బాషా కుటుంబ సభ్యులను పరామర్శించి వైకాపా అండగా ఉంటుందని భరోసా ఇచ్చినట్లు వైకాపా నాయకులు శివశంకర్ రెడ్డి,క న్వీనర్ సూర్యనారాయణరెడ్డి, సర్పంచులు ఆదినారాయణ, శ్రీధర్ రెడ్డి,షబ్బీర్, నాగరాజు, జయప్ప, రంగారెడ్డి తదితరులు తెలిపారు.

_____________________________

ప్రతి పేద కుటుంబానికి ఐదువేలు అందిస్తాం:ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే,ఏపిసీసి అధ్యక్షులు షర్మిల

శ్రీసత్యసాయి/అనంత జిల్లా ఫిబ్రవరి26(విజయస్వప్నం.నెట్)

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్టంలో ప్రతి పేద కుటుంబానికి ప్రతి నెల 5వేల రూపాయలు అందిస్తామని ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే,ఏపిసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హామీ ఇచ్చారు. అనంత జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో న్యాయ సాధన బహిరంగ సభ ఏర్పాటు చేయగా ముఖ్య అతిధులుగా ఏఐసీసీ మల్లికార్జునఖర్గే, ఏపిసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాల్గోని ప్రసంగించారు. సోనియాగాంధీకి,రాహుల్ గాంధీకి అనంత జిల్లా అంటే అభిమానమని,దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో రాష్టం అభివృద్ధి చెందిందని, సుపరిపాలన అందించేందుకు కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్మిలమ్మను మీముందుకు తీసుకొచ్చిందని ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే అన్నారు.దేశం అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, ప్రధాని మోడీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ధనిక వర్గాల  కోసం పని చేస్తోందని ఖర్గే విమర్శించారు. ప్రధాని మోడీ అంటే చంద్రబాబు,జగన్,పవన్ భయపడుతున్నారని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం మోడీని నిలదీయడానికి దైర్యం లేక బీజేపీతో పొత్తుల కోసం వెంటపడుతున్నారని అయన విమర్శలు చేశారు .ఏఐసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాట్లాడుతూ.... రాష్ట్ర విభజన పదేళ్లలో 5ఏళ్ళు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు,5 ఏళ్ళు జగనన్న పాలనలో రాష్ట్ర అభివృద్ధి కోసం ఏమి చేయలేదని,అభివృద్ధిలో రాష్టం 25ఏళ్ళు వెనక్కేళ్ళిందని ఆమె విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ప్రతి నెల ప్రతి పేద కుటుంబానికి 5వేలు అందిస్తామని, అన్ని రంగాలలో అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబడతమన్నారు. అనంతరం ప్రతి పేద కుటుంబానికి 5 వేలు అందిస్తామని రూపొందించిన చెక్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు,సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ,కాంగ్రెస్ పార్టీ మాజీమంత్రులు, ఎన్. రఘువీరారెడ్డి, శైలజానాథ్, రుద్రంరాజు, పల్లంరాజు, కేటీ శ్రీధర్, గౌతమ్, జాతీయ, రాష్ట్ర నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ జిల్లాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

_____________________________

ఆలయ ఉప ప్రధాన అర్చకులకి డాక్టరెట్ పురస్కారం

శ్రీసత్యసాయిజిల్లా కదిరి26(విజయస్వప్నం.నెట్)

పశ్చిమ బెంగాల్ కోలకత్తలో 2024 సంవత్సరం ఫిబ్రవరి 17వ తేదీ జరిగిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ హెరిటేజ్ యూనివర్సిటీ 45వ వార్షిక ఇంటర్నేషనల్ సెమినార్ నందు ఆంధ్రప్రదేశ్ లోని శ్రీసత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో వెలసిన శ్రీ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం ఉప ప్రధానార్చకులు అర్చకం కుమారరాజాచార్యులకి గౌరవ డాక్టరేట్ పురస్కారం అందజేశారు. దేశంలోని వివిధ యూనివర్సిటీల వైస్ ఛాన్స్లర్లు, సంస్కృత భాషా పండితులు, వేద పండితులు, వెస్ట్ బెంగాల్ కి చెందిన ఎంపీలు, వెస్ట్ బెంగాల్ హైకోర్టు చీఫ్ జస్టిస్ వివిధ అధికారులు ఈ సెమినార్కు హాజరయ్యారు. ధర్మశాస్త్రాల యందు విశేష ప్రతిభ కలిగి, 25 ఏళ్లుగా శ్రీమత్ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి పుణ్యక్షేత్రంలో నిత్య కైంకార్యములు నిర్వహిస్తూ ధర్మ ప్రచారమునకు తన వంతు కృషి చేయుచున్న  దేవస్థానం ఉప ప్రధానార్చుకులు అర్చకం కుమార్ రాజాచార్యులకి గౌరవ డాక్టరేట్ పురస్కారం అందుకొన్న సందర్బంగా ప్రముఖులు, పుర ప్రజలు, భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

26, ఫిబ్రవరి 2024, సోమవారం

శివాలయానికి విగ్రహాలు వితరణ - హెచ్.ఐ.వి / ఎయిడ్స్ పై నాటక ప్రదర్శన

 శివాలయానికి విగ్రహాలు వితరణ 


శ్రీసత్యసాయిజిల్లా ఓబుళదేవరచెరువు గ్రామానికి చెందిన బొడ్డు సాంబశివ కుమారుడు బొడ్డు నాగరాజు  వారి ధర్మపత్నిబొడ్డు అరుణ(మాజీ ఎంపిటిసి), ఓడిచెరువు గ్రామంలోని బస్టాండ్ సమీపంలో వెలసిన శివాలయానికి గణపతి,పార్వతీ పరమేశ్వరుల  ఉత్సవ పంచంలోహ విగ్రహాలను(నేడు) సోమవారం ఉదయం ఏడు గంటలకు వితరణ చేసి పూజా కార్యక్రమములు నిర్వహించి,  అన్న ప్రసాదములు అందించునున్నారని,కావున గ్రామంలోని భక్తాదులు,పుర ప్రజలు పూజా కార్యక్రమములో పాల్గొనాలని కుటుంబ సభ్యులు ఆదివారం ప్రకటనలో పిలుపునిచ్చారు.



వారు గణపతి, పార్వతీ పరమేశ్వరుల  ఉత్సవ పంచంలోహ విగ్రహాలను సోమవారం పురోహిత పూజారి మురళీ స్వామి సమక్షంలో అందజేశారు. అంతక ముందు మాఘు మాస సోమవారం పురస్కరించుకొని ఉదయం ఏడు గంటల నుండి  దాతలు బొడ్డు నాగరాజు,బొడ్డు అరుణమ్మ దంపతులు ఉత్సవ వి గ్రహాలను స్వగృహం నుండి పురావిధుల గుండా మేళతాలతో శివాలయం వరకు దర్శనార్థం ఊరేగింపు నిర్వహించారు. శివాలయంలో ఉత్సవ విగ్రహాలకు అభిషేకం,అర్చన  వివిధ పుష్ప్హాలతో అలంకరణ చేసి భక్తిశ్రద్దలతో ప్రత్యేక పూజా కార్యక్రమములు నిర్వహించి,దర్శనం కోసం విచ్చేసిన భక్తులకు తీర్ద,అన్న ప్రసాదములు అందజేశారన్నారు.పూజా కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు,పురప్రజలకు విగ్రహాల దాతలు బొడ్డు నాగరాజుతో పాటు కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.

______________________________

మాతృశ్రీ వృద్ధాశ్రమంలో.... టైలర్ నిజాం జన్మదిన వేడుకలు

శ్రీసత్యసాయిజిల్లా,ఆమడగూరు, ఫిబ్రవరి 25(విజయస్వప్నం.నెట్)

మండల పరిధిలోని గాజులపల్లి సమీపంలో శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఆదివారం ఓడిచెరువు గ్రామానికి చెందిన తెదేపా నాయకులు టైలర్ నిజాంవలి జన్మదిన వేడుకలు వృద్ధుల సమక్షంలో ఘనంగా జరుపుకొన్నారు. ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమంలో భాగంగా వృద్ధులకు భోజనాలు అందించి, టైలర్ షాప్ లో ఏడాది పాటు ప్రొగు చేసిన హుండీని పగులగొట్ట దాదాపు 10వేల రూపాయల నగదు ఆశ్రమ నిర్వహకురాలు అరుణజ్యోతికి అందజేశారు. ఆమె మాట్లాడుతూ.... ఆశ్రమంలో ప్రతి యేటా టైలర్ నిజాం వృద్ధులకు తమవంతుగా సహాయం అందిస్తున్నారని, టైలర్ నిజాంకు వృద్ధులతో పాటు అరుణజ్యోతి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టైలర్ నిజాం కుటుంబ సభ్యులు, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

_____________________________

శ్రీసత్యసాయిజిల్లా,కదిరి, ఫిబ్రవరి25(విజయస్వప్నం.నెట్)

కదిరి పట్టణంలోని మైనార్టీ ఫంక్షన్ హాల్  ఆవరణలో ఆదివారం 4 వ నేషనల్ లెవెల్ కరాటి ఛాంపియన్ షిప్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ శ్రీ సత్య సాయి జిల్లా కార్యదర్శి డాక్టర్ నాగన్న ను ఆహ్వానించారు.ఈసందర్బంగా నాగన్న  మాట్లాడుతూ.... విద్యార్థులకు విద్యతోపాటు క్రీడలపై అవగాహన కల్పించి ప్రోత్సాహించాలని, అన్ని రంగాల్లోనూ విద్యార్థులు ముందంజలో ఉంటూ సొంత ఊరికి,రాష్ట్రానికి,దేశానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని,పిల్లలకి చదువుతోపాటు క్రీడారంగంలో కూడా ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకి ధన్యవాదాలు తెలిపారు.ఈసందర్భంగా డాక్టర్ షేక్షావలి,డాక్టర్ ఏ.మురళీకృష్ణ ప్రెసిడెంట్ ఆఫ్ ఎస్ కే విSఎస్కేఏ ఇండియా, ఎన్.మోహన్ రావు వైస్ ప్రెసిడెంట్ ఆర్ఎస్ఏపీభి రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ శ్రీ సత్య సాయి జిల్లా కార్యదర్శి నాగన్న గారికి సన్మానించడం ô ఈ కార్యక్రమంలో ఆర్ సి పి మండల కార్యదర్శి శేఖర్ శశి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

_____________________________

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

శ్రీసత్యసాయిజిల్లా,ఓబుళదేవరచెరువు,ఫిబ్రవరి25(విజయస్వప్నం.నెట్)

2007 -08  పదవ తరగతి బ్యాచ్ ఆదివారం తంగేదుకుంట పంచాయతీ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో  విద్యార్థులు ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థుల  సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమంలో పూర్వ విద్యార్థులందరూ పాల్గొని గత తీపి జ్ఞాపకాలను  గుర్తులు నెమరు వేసుకున్నారు. సమ్మేళన కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా గడుపుతూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఉపాధ్యాయులు శ్రీమతి రాధమ్మ, అమృతవల్లి, రవికుమార్, రమేష్, కరుణాకర్ రెడ్డి పాల్గొని పూర్వ విద్యార్థులను ఉద్దేశించి సందేశమిచ్చారు. అనంతరం విద్యార్థులు గురువులకు పాదపద్మములకు నమస్కరించి ఘనంగా సన్మానించారు. ఈకార్యక్రమ నిర్వాహణ కమిటీ సభ్యులు జేజేoద్ర,అశోక్ కుమార్, అంజలి, రోహిత్, మున్నిరా, జయచంద్ర బాబు, అశోక్, సాయి తదితర పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ.... గురువులు నేర్పిన విద్య వల్ల సమాజంలో గౌరవప్రదమైన గుర్తింపుతో ఉన్నత స్థాయిలో ఉన్నారని, వేదికపై ఆశీనులైన గురువుల సేవలను పూర్వ విద్యార్థులు కొనియాడారు.

_____________________________

హెచ్.ఐ.వి / ఎయిడ్స్ పై నాటక ప్రదర్శన

శ్రీసత్యసాయిజిల్లా,ఓబుళదేవరచెరువు ఫిబ్రవరి25(విజయస్వప్నం.నెట్)

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ,జిల్లా ఎయిడ్స్ నివారణ,నియంత్రణ సంస్థ,జన జాగృతి కదిరి స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో  వెంకటేష్ కళాజాత బృందాలతో అవగాహన నాటక ప్రదర్శన నిర్వహించారు.శుక్రవారం ఓడిచెరువు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడలి వద్ద హెచ్.ఐ.వి/ఎయిడ్స్ పై అవగాహనకార్యక్రమాన్ని నిర్వహించారు.నాటక ప్రదర్శన ద్వారా హెచ్.ఐ.వి/ఎయిడ్స్ వ్యాధి లక్షణాలు,వ్యాధి వ్యాప్తి,హెచ్.ఐ.వి/ఎయిడ్స్ సోకకుండ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి,హెచ్.ఐ.వి/ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షత చిన్న చూపు లేకుండా  సమాజములో ఎలాగ కలసి జీవించాలి,హెచ్.ఐ.వి/ఎయిడ్స్,క్షయ వ్యాధి సంబందం గూర్చి,సుఖ వ్యాధులు,చికిత్సలు,కండోమ్ ఉపయోగాలు,హెచ్.ఐ.వి/ఎయిడ్స్ ఏక్ట్ 2017,ఏఆర్టి మందులు,ఏపిఎస్ఏ సి ఎస్ యాప్,టోల్ ఫ్రీ నెంబర్ 1097 తదితర అంశాలపై వెంకటేష్ కళాజాత బృందం కళాకారులు పుర ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో  జన జాగృతి కదిరి ప్రాజెక్ట్ మేనేజర్ ఇ.శ్రీనివాసులు,ఓ.ఆర్.డబ్ల్యూ శ్రీవాణి, శాంతమ్మ,ప్రసన్న,చంద్రకళ, విహన్ టీమ్ విజయ్,చైల్డ్ ఫండ్ ఇండియా యువరాజ్  పాల్గొన్నారు.

_____________________________

చట్టసభల్లో ప్రాధాన్యత కల్పించాలి

బంజారా గర్జన భారీ ర్యాలీ 

శ్రీసత్యసాయిజిల్లా కదిరి ఫిబ్రవరి 25(విజయస్వప్నం.నెట్)

కదిరి పట్టణంలో  బంజారా నాయకులు ఆదివారం బంజారా గర్జన ర్యాలీ నిర్వహించారని ఎం. నారాయణనాయక్ తదితరులు తెలిపారు. పట్టణ పురవీధుల్లో వేలాది మంది గిరిజన సోదరులు ర్యాలీలో పాల్గొన్నారని, అనంతరం కదిరి  ప్రభుత్వ జూనియర్ బాలుర కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొన్నారన్నారు.స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఎన్ని ప్రభుత్వాలు మారుతున్న బంజారా ప్రాంతాలలో అభివృద్ధిని,గిరిజనుల సమస్యలు విస్మరించారన్నారు. గిరిజనులకు చట్టసభల్లో ప్రాధాన్యత,విద్యా,ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు,తండాల అభివృద్ధి సాధన కోసం ప్రతి బంజారా బిడ్డలు ఉద్యమంలో పాల్గొనాలని బంజారా నాయకులు కోరారు.

_____________________________

శాస్త్రీయ ఆలోచనతోనే సామాజిక మార్పు సాధ్యం

డాక్టర్ సి.వి.మదన్ కుమార్

శ్రీసత్యసాయిజిల్లా, కదిరి25(విజయస్వప్నం.నెట్)

దిరి పట్టణంలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఆదివారం ఎన్జీవో భవనంలో సంస్థ జిల్లా ఉపాధ్యక్షులు బి.నరసారెడ్డి అధ్యక్షతన పిళ్లా కుమారస్వామి రచించిన "శాస్త్రీయ ఆలోచన" అనే గ్రంథాన్ని ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రిషిత చిన్నిపిల్లల వైద్యులు సి.వి మదన కుమార్, న్యాయవాది నరసింహులు, యుటిఎఫ్ నాయకులు శ్రీనివాసులు, సుబ్బారెడ్డి ఎల్ఐసి ఏజెంట్ల సంఘం నాయకులు బయప్ప, జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు ఆదిశేషు, ఇంద్రజాలకులు నబి. రచయిత పిళ్లా కుమారస్వామి, పెన్షనర్ల సంఘం నాయకులు వీరస్వామి పాల్గొన్నారు. అధ్యక్షుడు నర్సారెడ్డి మాట్లాడుతూ జనవిజ్ఞాన వేదిక కదిరి ప్రాంతంలో ఉన్న అనేక మూఢనమ్మకాలపై  ప్రజలలో చైతన్యం తీసుకొచ్చేందుకు వివిధ రూపాల ప్రదర్శనలతో ప్రయత్నం చేస్తుందన్నారు. మూర్చ వైద్య శిబిరాలను, విద్యార్థులకు చెకుముకి పరీక్షలను నిర్వహిస్తోందన్నారు. ఆయన స్వయంగా మ్యాజిక్ ఫైర్  ప్రదర్శించి ప్రేక్షకులను ఆశ్చర్య చకితుల్ని చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన వైద్యులు సి.వి. మదన్ కుమార్ మాట్లాడుతూ రచయిత పిళ్లా కుమారస్వామి తన వంతు సామాజిక బాధ్యత నెరవేర్చాడన్నారు. శాస్త్రీయ ఆలోచన మనిషిని ఉన్నతంగా ఆలోచింప చేస్తుందని, మూఢ విశ్వాసాలకు గురికాకుండా చేస్తుందన్నారు. శాస్త్రీయ ఆలోచన సమాజ మార్పుకు దోహదం చేస్తుందన్నారు. చాలామంది ఈ దిశగా కృషి చేస్తూ ఉన్నారని అందువల్లనే సమాజంలో ఇప్పుడిప్పుడే మార్పులు వస్తున్నాయని, భవిష్యత్తులో మూఢనమ్మకాలు పూర్తిగా తెర మరుగౌతాయని ఆశభావం వ్యక్తం చేశారు. జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు డా.ఆదిశేషు మాట్లాడుతూ..... నేటి పాలకులు అనేక మూఢ విశ్వాసాలపై ప్రచారం చేస్తున్నారని, అంతేగాక సైన్సు నిరూపించిన అంశాలను కూడా పద్ధతి ప్రకారం పాఠ్యప్రణాళిక లోంచి తొలగిస్తున్నారని ఆయన అన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం జ్యోతిషాన్ని విశ్వవిద్యాలయాల్లో ప్రవేశపెట్టిందన్నారు. అంతేగాక ఆల్ ఇండియా సైన్స్ కాంగ్రెస్ లో అనేక శాస్త్రీయ అంశాలను ఎప్పుడో ప్రాచీన భారతదేశంలో ఉన్నాయని ప్రచారం చేస్తూ, వాటన్నిటినీ సైన్స్ అని చెప్పుకుంటూ, ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు.సమాజం ముందుకు పోతోందో, వెనక్కి పోతుందో తెలియని అయోమయ పరిస్థితిలో ఉందన్నారు.ఈనేపథ్యంలో సమాజంలో ఉన్న అనేక శాస్త్రీయ ధోరణులకు అడ్డుకట్ట వేయడానికి ఇలాంటి శాస్త్రీయ ఆలోచనా ధోరణి గల పుస్తకాలు ఎక్కువగా రావాలని,ఈ పుస్తకాలనే సోషల్ మీడియాలో వేరువేరు రూపాలలో ప్రచారం చేయాలని ఆయన కోరారు.న్యాయవాది నరసింహులు మాట్లాడుతూ సమాజంలో అనేక సామాజిక నమ్మకాలు ఉన్నాయని,అవి కులంతో ముడిపడి ఉన్నాయన్నారు. ఆ కుల దృక్పథం నుంచి రచయిత బయటపడడానికి ఆయనకు  శాస్త్రీయ ఆలోచన దోహద పడిందన్నారు. ఎల్ఐసిఏజెంట్ల సంఘం నాయకులు బయ్యప్ప మాట్లాడుతూ జనవిజ్ఞాన వేదిక ఎంతోమందిని శాస్త్రీయ ఆలోచన వైపు మళ్ళించిందని, ఆ వేదిక చేసిన గత 25 ఏళ్ళ  సేవలను వివరిస్తు కొనియాడారు. ఈ సందర్భంగా  సైన్సు క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వీరస్వామి, సైంటిస్ట్ చండ్రాయుడు, సాహితీ  స్రవంతి నాయకులు రాజశేఖర్, కదిరి అభివృద్ధి వేదిక నాయకులు చింతా శ్రీనివాసులు, రైతు సంఘం నాయకులు సుబ్బిరెడ్డి, సిపిఎం నాయకులు నరసింహులు, ఎస్ఎఫ్ఐ నాయకులు బాబ్జాన్, సిఐటియు నాయకులు యాకూబ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

_____________________________

సాహసం చేసిన మోదీ.. సముద్ర గర్భంలోకి వెళ్లి

గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ సముద్రంలో మునిగిపోయిన ద్వారకా నగరానికి వెళ్లి సాహసమే చేశారు. ఇండియన్ నేవీ సహాయంతో ఆక్సిజన్ సిలిండర్లు ధరించి సముద్రంలో అట్టడుగుకు చేరుకుని శ్రీకృష్ణుడికి ప్రార్థనలు చేసిన వీడియోను పిఎంఓ ట్విటర్లో షేర్ చేసింది. ప్రార్థనా స్థలంలో మోదీ ధ్యానం చేస్తూ నెమలి ఈకలను ఉంచి నమస్కరించారు. ఈ చర్యతో ద్వారకా టూరిజం మరింత పెరుగుతుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.


25, ఫిబ్రవరి 2024, ఆదివారం

26న కాంగ్రెస్ బహిరంగ సభ జయప్రదం చేయండి - లక్ష ఆర్థికసాయం చేసిన ఎమ్మెల్యే అభ్యర్థి మక్బుల్ - వాలంటీర్లకు ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి సన్మానం - పురుగల మందుల డబ్బాలతో రైతులు ధర్నా - గురుకుల పాఠశాలలో అపరిచితుడు హంగామా!!....

26న కాంగ్రెస్ బహిరంగ సభ జయప్రదం చేయండి

శ్రీసత్యసాయిజిల్లా కదిరి ఫిబ్రవరి 24(విజయస్వప్నం.నెట్)

అనంతపురం జిల్లా కేంద్రంలో 26వతేది సోమవారం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో బహిరంగసభ నిర్వహించనున్నారని నియోజకవర్గం పరిధిలోని నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి జయప్రదం చేయాలని శనివారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లయన్ ఖాసీం ఖాన్ విలేకరుల సమావేశంలో పిలుపునిచ్చారు.ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల,సిడబ్లయ్యు సభ్యులు ఎన్.రఘువీరారెడ్డి,రుద్రంరాజు,పల్లంరాజు,మాజీమంత్రి శైలజానాథ్,గౌతమ్,కే.టీ శ్రీధర్ రాష్ట్ర, జాతీయ నాయకులు సమక్షంలో లక్షలాది మందితో భారీ బహిరంగసభ నిర్వహించనున్నట్లు అయన పేర్కొన్నారు.జిల్లా నుండి ఎన్నికల ప్రచారం మొదలు పెట్టటానికి బహిరంగసభ వేదికగా ఏర్పాట్లు చేస్తున్నారని,కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని,రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వేదిక ద్వారా సందేశం ఇవ్వాలని బహిరంగసభ నిర్వహిస్తున్నట్లు అయన పేర్కొంటూ.... నాయకులు,కార్యకర్తలు, అభిమానులు అధికసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని అయన పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బీసీ రాష్ట్ర సమన్వయకర్త నచ్చు బాలకృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

______________________________

లక్ష ఆర్థికసాయం చేసిన ఎమ్మెల్యే అభ్యర్థి మక్బుల్

శ్రీసత్యసాయి జిల్లా తలుపుల ఫిబ్రవరి24(విజయస్వప్నం.నెట్)

కదిరి డివిజన్ తలుపుల మండల పరిధిలోని పూతలవాండ్లపల్లి పంచాయతీ నాయనవారిపల్లి గ్రామంలో గత కొన్ని నెలలుగా విద్యుత్ అంతరాయంతో తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు శనివారం స్థానిక సర్పంచ్ పెద్దినాయుడుతో కలిసి కదిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బి.ఎస్ మక్బుల్ దృష్టికి తీసుకెళ్లగా,తక్షణమే ఆయన స్పందించి గ్రామంలో తాగునీటి సమస్య తలెత్తకుండా విద్యుత్ సరఫరాకు అవసరమయ్యే పరికరాల కోసం లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందజేశారని తెలిపారు.అడిగిన వెంటనే ఆర్థికసాయం చేసిన ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బూల్ కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.ఈకార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్ఎండి ఇస్మాయిల్,కే.ఎర్రంనాయుడుకే.చలపతి నాయుడు,పి.ప్రభాకర్,కే.కొండ మనాయుడు,కే.భాస్కర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

______________________________

వాలంటీర్లకు ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి సన్మానం

శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఫిబ్రవరి24(విజయస్వప్నం.నెట్)

ఓడిచెరువు మండల తహశీల్దార్ కార్యాలయం ఆవరణలో శనివారం ఏర్పాటు చేసిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో పుట్టపర్తి శాసన సభ్యులు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ముఖ్య అతిధిగా విచ్చేసి ఆమడగూరు, నల్లమాడ, ఓడిచెరువు గ్రామ వాలంటీర్లను సన్మానించారు. అయన ఈసందర్బంగా మాట్లాడుతూ.... రాష్ట్ర ముఖ్యమంత్రి జగనన్న ప్రవేశ పెట్టిన వాలంటీర్ వ్యవస్థ దేశ చరిత్రలోనే గర్వించదగ్గ విషయమని కొనియాడారు.గ్రామ వాలంటరీ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలోని దాదాపుగా 2 లక్షల మంది యువతకు ఉద్యోగావకాశాలు కల్పించమన్నారు.వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి సామాన్యుడికి కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా ప్రతి ఇంటికి వెళ్లి సేవలందించే విధంగా  ఇప్పటివరకు ఏ ప్రభుత్వం అమలు చేయలేదని, అది ఒక్క వైస్సార్సీపీ జగనన్న ప్రభుత్వానికే సాధ్యమని,కరోనా క్లిష్టసమయాల్లో వాలంటీర్లు అందించిన సేవ మరవలేనివని,సేవలందించిన ప్రతి ఒక్కరికీ ఈసందర్బంగా ఎమ్మెల్యే సెల్యూట్ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగనన్న ప్రవేశ పెట్టిన వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలనే టిడిపి అధినేత చంద్రబాబు మాటలని ఖండించారు. అనంతరం ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి వాలంటీర్లను సన్మానించి సేవవజ్ర,సేవ మిత్ర,సేవ రత్న పురస్కారాలు అందజేశారు.

______________________________

పురుగల మందుల డబ్బాలతో రైతులు ధర్నా 

విద్యుత్ కోతలపై రైతులు నిరసన 



శ్రీసత్యసాయిజిల్లా ఆమడగూరు ఫిబ్రవరి 24(విజయస్వప్నం.నెట్)

విద్యుత్ కొతలతో రబిలో సాగుచేసిన పంటలు ఎండిపోయి నష్టపోయే పరిస్థితి నెలకొందని, రైతులకు ఆత్మహత్యలే శరణ్యమని శనివారం మండల కేంద్రంలో రైతులు పురుగుల మందుల డబ్బాలు చేతిలో పట్టుకొని విద్యుత్ కేంద్రం ముందు నరసన తెలిపి ధర్నా చేపట్టారు.లక్షలు అప్పుచేసి పంటలు సాగుచేస్తే లోఓల్టేజితో విద్యుత్ కోతలు విధిస్తున్న అధికారుల నిర్లక్ష్య వైఖరిపై రైతులు అసహనం వ్యక్తం చేస్తూ.... పురుగుల మందు సేవించడానికి యత్నించగా పోలీసులు అప్రమత్తమై పురుగుల మందు డబ్బాలను లాగి పడేసారు.రబి సీజన్లో సాగుచేసుకొన్న పంటలు తీర చేతికొచ్చే సమయంలో లో ఓల్టేజి కారణంతో విద్యుత్ కోతలు విధించి వేళపాల లేకుండా విద్యుత్ సరఫరా చేయడంతో పంటలు ఎండిపోతున్నాయని ఇలాంటి పరిస్థితిలో ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు.9గంటల నుండి 7గంటలకు కుదించి విద్యుత్ కోతలు విధిస్తున్న అధికారుల నిర్లక్ష్య తీరును నిరసిస్తూ 5గంటలపాటు రైతులు ధర్నా చేపట్టారు.విద్యుత్ సమస్యలపై సిబ్బందికి సమాచారం అందిస్తే.... నిర్లక్ష్యంగా వ్యవహారిస్తూ.... రైతుల సమస్యలు విస్మరించి నిరంతరం సిబ్బంది కర్ణాటక బిల్లూరు మద్యం దుకాణాల వద్ద దర్శనం ఇస్తన్నారని మండిపడ్డారు. ఏఈ చంద్రానాయక్ స్పందిస్తూ.... చిన్నగానిపల్లి, కససముద్రం ప్లీడర్లలో ఓవర్ లోడ్ వల్ల సమస్య ఉందని, విద్యుత్ మరమ్మత్తు పనులు చేపట్టి,కెపాసిటీ స్టాటర్లు అమర్చి రెండు రోజుల్లో పూర్తి చేసి 9గంటపాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.ఈకార్యక్రమంలో లక్ష్మీనారాయణ, మంజునాథరెడ్డి,లోకేష్ రెడ్డి, ఈశ్వరప్ప, చెన్నకేశవ, చంద్రాయప్ప, నాగరాజు,శివశంకర, వెంకటరెడ్డి, శ్రీనివాసులు, శివప్ప, రంగప్ప, రాంమోహన్ తదితర గ్రామ రైతులు పాల్గొన్నారు.

______________________________


శ్రీ సత్య సాయి జిల్లా,పుట్టపర్తి నియోజకవర్గం అమడగూరు మండలంలోని తిమిరికుంటపల్లికి చెందిన 20 కుటుంబాలు మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సందర్భంగా మాజీమంత్రి పల్లె వారికి తెలుగుదేశం పార్టీ కండువాలు వేసి పార్టీలోకి  సాధారణంగా ఆహ్వానించారు. ఈకార్యక్రమంలో తెదేపా శ్రేణులు పాల్గొన్నారు.

______________________________

గురుకుల పాఠశాలలో అపరిచితుడు హంగామా!!....

ఎస్ఐ కి ఉపాధ్యాయ బృందం పిర్యాదు 

శ్రీసత్యసాయిజిల్లా, తనకల్లు, ఫిబ్రవరి23(విజయస్వప్నం.నెట్)

మండలంలోని సిజీ ప్రాజెక్టు సమీపంలో ఎస్టీ గురుకుల పాఠశాలలో రెండు రోజుల క్రితం రాత్రి వేళ అపరిచిత వ్యక్తి ప్రహరీ గోడ వెనుకవైపు నుండి పాఠశాల ప్రాంగణంలో ప్రవేశించి వెనుక గది అద్దాలు పగులకొట్టి లోపల ఉన్న విద్యార్థినీలను భయబ్రాంతులకు గురి చేసినట్లు ఎస్ఐ ధరణి బాబుకు శుక్రవారం పిర్యాదు చేసినట్లు ఇంచార్జ్ ప్రిన్స్పాల్ తెలిపారు.గ్రామానికి దూరంగా ఉన్న పాఠశాలలో ఇలాంటి  సంఘటనలు భవిష్యత్ రాకుండా పోలీసులు రాత్రి వేళల్లో బందోబస్త్ నిర్వహించాలని వారు కోరుతూ.... అపరిచిత వ్యక్తిపై పిర్యాదు చేసినట్లు ఉపాధ్యాయులు తెలిపారు.

______________________________

విజయస్వప్నం.నెట్ ఫిబ్రవరి 24(శ్రీసత్యసాయిజిల్లా)

నెల్లూరు జిల్లా కవాలి పట్టణంలోని శ్రీ పట్టాభిరామస్వామి దేవస్థానం ధర్మశాల ఆవరణలో శనివారం శ్రీగురు శాంత్ రవిదాస్ జయంతి సందర్బంగా ముఖ్య అతిధిగా హాజరై చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా వేడుకలు నిర్వహించినట్లు కదిరి పట్టణానికి చెందిన ఏపీ బిజెపి ఎస్సి మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గుడిసె దేవానంద్ తెలిపారు.ఈకార్యక్రమంలో కవాలి బిజెపి పట్టణ అధ్యక్షులు బ్రహ్మానందం,నెల్లూరు బిజెపి జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ ఎస్సి మోర్చా ఉపాధ్యక్షులు పారసు వెంకటేశ్వర్లు,నెల్లూరు జిల్లా బీజేపీ ఎస్సి మోర్చా అధ్యక్షులు పారసు మధు తదితరులు పాల్గొన్నారన్నారు.